Youth: అట్టుడికిపోయిన ఊరు, ఊరేగింపులో హింస, వాహనాలు, ఆస్తులకు నిప్పు, హత్యకు ప్రతీకారంతో !
బెంగళూరు/ శివమొగ్గ: భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురి కావడంతో శివమొగ్గ పట్టణం రణరంగంగా మారిపోయింది. హర్షా అంత్యక్రియలు చెయ్యడానికి విద్యానగర్ లోని రోటరి స్మశానవాటిక వరకు ఊరేగింపుగా భజరంగ్ దల్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బయలుదేరిన సమయంలో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసుల ఆదేశాలను లెక్కచెయ్యకుండా ఊరేగింపుగా బయలుదేరిన కార్యకర్తలు సహనం కోల్పోయారు.
వేలాది మంది ఒకేసారి ఊరేగింపుగా బయలుదేరడంతో పలువురు సహనం కోల్పోయి ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ల మీద రాళ్ల వర్షం కురిపించారు., ఓ వర్గానికి చెందిన వారి షాపులు ఆస్తులు ధ్వంసం చేశారు. కార్లకు నిప్పంటించారు. తోపుడు బండ్లకు నిప్పంటించారు కాల్చి బూడిద చేశారు. ఆ సమయంలో అడ్డు వెళ్లిన పోలీసుల మీద రాళ్ల వర్షం కురించారు. పరిస్థితి చెయ్యిదాటడంతో పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. హర్షా హత్యతో శివమొగ్గ జిల్లా అట్టుడికిపోయింది. కేఎస్ ఆర్ పీ, సీఆర్ పీ, అదనపు పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. శివమొగ్గ జిల్లాలోకి ఇతర జిల్లాల ప్రజలు వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Muslim goons: ముస్లీం గూండాలను డీకేసీ రెచ్చగొట్టి అమాయకులను చంపిస్తున్నారు, మంత్రి ఫైర్!
చాలరోజుల నుంచి స్కెచ్
శివమొగ్గలో నివాసం ఉంటున్న భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా మీద చాలా కాలం నుంచి కొంత మందికి కన్నుపడింది. ఎలాగైనా హర్షాను చంపేయాలని వేచి చూస్తున్న ప్రత్యర్థులకు అంత త్వరగా అవకాశం రాలేదని తెలిసింది. అయితే హర్షాను ఆదివారం రాత్రి చంపేయాలని గట్టిగా డిసైడ్ అయిన ప్రత్యర్థులు వాళ్లు అనుకున్న పని పూర్తి చేశారు.
ఫోన్ చేసి పిలిపించారు..... ప్రాణం పోతుందని ఊహించలేదు
ఆదివారం రాత్రి ఇంట్లో ఉన్న హర్షాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి బయటకు పిలిపించుకున్నాడని వెలుగు చూసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన హర్షాను పక్కాప్లాన్ తో చంపేశారు. హర్షాను హత్య చేసిన హంతకులు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని వెళ్లిపోయారు. హర్షాను హత్య చేసిన విషయం వెలుగు చూసే సమయంలో నిందితులు ఆ ఏరియా నుంచి పరారైనారు.
అంత్యక్రియల కోసం ఊరేగింపు
భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురి కావడంతో శివమొగ్గ పట్టణం రణరంగంగా మారిపోయింది. హర్షా అంత్యక్రియలు చెయ్యడానికి విద్యానగర్ లోని రోటరి స్మశానవాటిక వరకు ఊరేగింపుగా భజరంగ్ దల్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బయలుదేరిన సమయంలో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాళ్ల వర్షం..... దుమ్ములేపేశారు
ఆ సమయంలో పోలీసుల ఆదేశాలను లెక్కచెయ్యకుండా ఊరేగింపుగా బయలుదేరిన కార్యకర్తలు సహనం కోల్పోయారు. వేలాది మంది ఒకేసారి ఊరేగింపుగా బయలుదేరడంతో పలువురు సహనం కోల్పోయి ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ల మీద రాళ్ల వర్షం కురిపించారు., ఓ వర్గానికి చెందిన వారి షాపులు ఆస్తులు ధ్వంసం చేశారు. కార్లకు నిప్పంటించారు. తోపుడు బండ్లను నిప్పంటించారు కాల్చి బూడిద చేశారు. ఆ సమయంలో అడ్డు వెళ్లిన పోలీసుల మీద రాళ్ల వర్షం కురించారు.
Recommended Video
రంగంలోకి దిగిన అదనపు పోలీసు బలగాలు
పరిస్థితి చెయ్యిదాటడంతో పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. హర్షా హత్యతో శివమొగ్గ జిల్లా అట్టుడికిపోయింది. కేఎస్ ఆర్ పీ, సీఆర్ పీ, అదనపు పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. శివమొగ్గ జిల్లాలోకి ఇతర జిల్లాల ప్రజలు వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యానగర్ లోని రోటరి స్మశానవాటికలో భజరంగ్ దళ్ కార్యకర్త అంత్యక్రియలు నిర్వహించడానికి వందలాది మంది కార్యకర్తులు హాజరైనారు.