మార్పిడిపై ఆందోళన: బ్యాంకులు ఇలా చేస్తాయి..
న్యూఢిల్లీ: రూ. 500, 1000 నోట్ల మార్పిడికి బ్యాంకులు గురువారం నుంచి అదనపు గంటలు పనిచేసే అవకాశం ఉంది. ఎక్కువ సమయం కూడా పనిచేస్తాయి. చెల్లని ఆ నోట్లను మార్పిడి చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను బ్యాంకులు కల్పిస్తున్నాయి. గురువారం నుంచి బ్యాంకులు నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తాయి.
అంతేకాకుండా, ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్తో పాటు ప్రభుత్వం ముంబై, దేశరాజధాని ఢిల్లీల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయబోతున్నాయి. సమస్య తలెత్తకుండా ఆ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ఆ విషయం చెప్పారు.

చిన్న విలువ గల నోట్లను పోగు చేసుకోవడానికి బ్యాంకులకు బుధవారం సెలవు ప్రకటించారు. గురువారం నుంచి అంటే ఈ నెల 10వ తేదీ నుంచి చెల్లని నోట్లను బ్యాంకులు తీసుకుంటాయి. డిసెంబర్ 30వ తేదీ వకరు ప్రజలు తమ ఖాతాల్లో చెల్లని నోట్లను జమ చేయడానికి అవకాశం ఉంటుంది.
బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లలో రోజుకు రూ. 4000 చొప్పున ఈ నెల 24వ తేదీ వరకు చెల్లని నోట్లను మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.బ్యాంకులు అసాధారణమైన లావాదేవీలను ఆర్థిక నిఘా శాఖకు, పన్నుల అధికార యంత్రాంగానికి స్క్కూటినీ కోసం తెలియజేస్తాయి.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications