మరికొన్ని గంటల్లో పోలింగ్.. బెంగాల్, అసోంలో.. ఏర్పాట్లు పూర్తి
తొలి దశ ఎన్నికలకు పోలింగ్ శనివారం జరగనుంది. పశ్చిమ బెంగాల్ లోని 30 స్థానాలకు, అసోంలోని 47 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ బూతులకు సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. బెంగాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. పటిష్టమైన భద్రత మధ్య ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు.

ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న 30 నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు నక్సల్స్ ప్రభావిత జంగ్లీమహల్ ప్రాంతంలోనివే కావడం విశేషం. 2016లో ఈ ప్రాంతంలో టీఎంసీ భారీగా సీట్లు కైవసం చేసుకుంది. 30 సీట్లలో మొత్తం 27 టీఎంసీ గెలుచుకోగా... కాంగ్రెస్ రెండు సీట్లు, ఆర్ఎస్పీ ఒక స్థానంలో గెలుపొందింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో ఈ ప్రాంతంలో ఎక్కువ పార్లమెంటరీ స్థానాలను బీజేపీ గెలిచింది. దీంతో ఈ ప్రాంతంలో తమకు పైచేయి ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అసోంలో మొదటి దశలో సీఎం సర్బానంద సోనోవాల్,స్పీకర్ సహా పలువురు కేబినెట్ మంత్రులు పోటీలో ఉన్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications