పెళ్లయిన కొద్దిరోజులకే..: విగతజీవిగా నవ వధువు, ఏం జరిగింది?
కృష్ణరాజపురం: కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఓ నవవధువు అనుమానానస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన కే.ఆర్.పురం రైల్వేస్టేషన్ పరిధిలోని రైల్వే వసతి సముదాయంలో సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్న నరేశ్ తన స్నేహితురాలైన రమితా(21)ని మార్చిలో వివాహం చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరు.. ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ క్రమంలోనే స్నేహం కాస్త ప్రేమగా మారింది.

ఆపై పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇటీవల నరేశ్ తల్లి మృతి చెందడంతో ఆమె దుస్తులు ఖాళీ చేసే విషయమై విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇదే విషయంపై గొడవ జరుగుతూ వస్తున్న క్రమంలోనే సోమవారం రమితా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెళ్లయి నెల రోజులైనా కాకముందే తమ కూతురు మరణించడాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. ఇది ముమ్మాటికి హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మరో యువతిని వివాహం చేసుకోవడానికి నరేశ్ ప్రయత్నిస్తున్నాడని, అందుకే రమితాను హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై కేఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications