చాణక్య ఎగ్జిట్ పోల్ అంచనా: పంజాబ్ లో పోటాపోటీ.. ఉత్తరాఖండ్ బీజేపీదే
చాణక్య ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం... పంజాబ్ లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నడమే ఉంటుంది.. ఇక ఉత్తరాఖండ్ లో బీజేపీ అవలీలగా అధికారం చేజిక్కించుకుంటుంది.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఒక్క పంజాబ్ లో తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం సాయంత్రం వెలువడిన ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే... నోట్ల రద్దు అంశం బీజేపీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని అర్థమవుతోంది.
పంజాబ్ లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండింటి పరిస్థితి.. నువ్వా? నేనా? అనేలా ఉన్నట్లు చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఈ రెండు పార్టీలు ఇక్కడ కాస్త అటూ ఇటుగా 54 సీట్లు గెలుచుకుంటాయని, శిరోమణి అకాలీదళ్-బీజేపీ సంయుక్తంగా 9 సీట్ల వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చాణక్య ఎగ్జిట్ పోల్ అంచనా.

పంజాబ్ లో మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలే దాదాపు 34 నుంచి 37 శాతం వరకు పంచుకుంటాయని, మిగిలిన ఓట్లలో శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి 22 నుంచి 25 శాతం వరకు పంచుకుంటాయని, ఇక 10 నుంచి 13 శాతం ఓట్లు ఇతరులకు వెళ్తాయని చాణక్య ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఈ అంచనాలే గనుక నిజమైతే.. పంజాబ్ లో ఈసారి కూడా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడనుంది.
ఉత్తరాఖండ్ లో బీజేపీ హవా
ఉత్తరాఖండ్ లో బీజేపీ పాగా వేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. గురువారం సాయంత్రం ప్రకటించిన చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ గెలిచే అవకాశముందని తేలింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పలు జాతీయ ఛానెళ్లు ఇక్కడ బీజేపీ గెలుపునకే మొగ్గు చూపగా.. కాంగ్రెస్ ను రెండో స్థానానికి పరిమితం చేశాయి. చాణక్య సర్వే ప్రకారం 70 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీకి 53, అధికార పక్షమైన కాంగ్రెస్ కు 15, ఇతరులకు 2 సీట్లు రానున్నాయి.
ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే.. ఉత్తరాఖండ్ లో బీజేపీ అవలీలగా అధికారం చేజిక్కించుకుంటుందని చెప్పొచ్చు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలవడానికి ప్రధాన కారణం ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే అని చెప్పాలి. చాలా నియోజకవర్గాలలో రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థుల బెడద లేకుండా చాకచక్యంగా వ్యవహరించడం బీజేపీకి బాగా కలిసొచ్చిన అంశం.
-
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications