"పది రూపాయలుంటే రెండు ప్రాణాలు దక్కేవి"
లక్నో : కడు పేదరికంలో కాలం వెళ్లదీస్తున్న ఆ దంపతులను కేవలం రూ.15 కోసం అత్యంత దారుణంగా హత్య చేశాడో ఓ షాపు యజమాని. గత గురువారం నాడు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని రూ.15 చెల్లించడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంగా.. నడిరోడ్డుపైనే భరత్ సింగ్ అనే దళిత దంపతులను అశోక్ మిశ్రా అనే ఓ షాపు యజమాని గొడ్డలితో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. దంపతులిద్దరు చనిపోవడంతో వారి సంతానమైన ముగ్గురు కొడుకులు అనాథలుగా మారిపోయారు.
కాగా ఘటనపై స్పందించిన భరత్ సింగ్ దంపతుల కుమార్తె మిలాన్ (18) తమ కుటుంబం ఎంత దయనీయ స్థితిలో బతుకుతుందో వివరించింది. హత్య జరిగిన రోజు తన తల్లిదండ్రుల వద్ద ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయని, అయితే వాటితో ఓ చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని ఆకలి తీర్చుకుందామనుకున్నారని.. చివరికి ఖాళీ కడుపుతోనే హత్య గావింపబడ్డారని కన్నీరు మున్నీరైంది మిలాన్.
ఇదిలా ఉంటే మిలాన్ కు ఇప్పటికే వివాహిత కాగా.. తన తల్లిదండ్రుల మరణంతో ముగ్గురు సోదరులు అనాథలుగా మారారని విలపించింది.

ఆరోజు ఏం జరిగింది..?
హత్య జరిగిన గత గురువారం ఉదయం యథావిధిగా కూలీ పనికి బయలుదేరారు భరత్ సింగ్ దంపతులు. అప్పటికీ ఏమి తినకపోవడంతో తమ వద్ద ఉన్న ఐదు రూపాయలతో ఓ షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నారు. అయితే అంతకుముందే దాని పక్కనున్న షాపులో రూ.15 బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని బకాయిపడ్డారు.
అయితే అదే షాపుకు వెళితే బాకీ కింద ఉన్న ఐదు రూపాయలను ఎక్కడ లాగేసుకుంటాడోన్న భయంతో పక్క షాపుకు వెళ్లారు ఆ దంపతులు. ఇదే వారి హత్యకు కారణమైంది. తన షాపులో బకాయిపడి పక్క షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్ మిశ్రా దంపతులిద్దరిని గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.
ఘటనపై స్పందించిన అక్కడి ప్రభుత్వం.. దంపతుల మృతికి నష్టపరిహారంగా ఆ కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించింది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications