భక్తి పేర మహిళలతో దొంగబాబా రాసలీలలు
జైపూర్: అమాయక భక్తులను బురిడీ కొట్టించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన మరో దొంగబాబా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే... భక్తిమార్గం చూపుతాడని దరిచేరితే రక్తిమార్గంలో నడిపి రాసలీలలు సాగించిన రజనీశ్ గ్రోవర్ అలియాస్ అశోక్కుమార్ అనే బాబాపై జైపూర్ పోలీసులు లైంగిక దాడి కేసు నమోదు చేశారు.
నమ్మిన భక్తురాళ్లకు మత్తు మందు కలిపిన బిస్కట్లు ఇచ్చి లైంగిక దాడి జరుపడమే కాకుండా ఫొటోలు తీసుకొని వికృతానందాన్ని పొందిన ఈ బాబాపై జైపూర్కు చెందిన ఓ 22 ఏళ్ల మహిళ కేసు పెట్టింది. ఢిల్లీలోని ఛత్తర్పూర్ ప్రాంతంలో ఇతడు నడిపే సత్సంగ్లకు ఆమె హాజరయ్యేది.
ఈ క్రమంలో జైపూర్లో ఒక షాపు ప్రారంభించిన సదరు మహిళ ఆశీస్సులు కోసం బాబాను ఆహ్వానించింది. జైపూర్లో ఆమె ఇంటిలో బసచేసిన బాబా ప్రసాదం పేరిట మత్తుమందు కలిపిన బిస్కట్లు ఇచ్చి ఆ మహిళపై, ఆమె తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

మైకంలో ఉన్న మహిళ, ఆమె తల్లికి సంబంధించిన అభ్యంతరకరమైన ఫొటోలు కూడా తీశాడు. మత్తు నుంచి తేరుకొన్న తర్వాత ఇదేమిటి? అని నిలదీస్తే వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. గుట్టురట్టు చేస్తే మీ ఫొటోలు బయటపెడతానని హెచ్చరించాడు.
ఆ మహిళ చివరకు బాబా స్మార్ట్ ఫోన్ను ఎలాగోలా చేజిక్కించుకుని, అందులో తమవి మాత్రమే కాకుండా వేరే ఇతర మహిళలకు సంబంధించిన అనేక నగ్న చిత్రాలు ఉండటం చూసి కంగుతింది. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications