ఎన్ఆర్ఐ భర్తల బాధితుల కోసం త్వరలో వెబ్ పోర్టల్
ఎన్నారై భర్తల చేతిలో మోసపోయిన బాధిత భార్యలకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక వెబ్ పోర్టల్ ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ లో అడ్వకేట్లు, స్వచ్ఛంద సంస్థలు తదితర సమాచారం ఉంటుంది.
న్యూఢిల్లీ: ఎన్నారై భర్తల చేతిలో మోసపోయిన బాధిత భార్యలకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక వెబ్ పోర్టల్ ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ లో అడ్వకేట్లు, స్వచ్ఛంద సంస్థలు తదితర సమాచారం ఉంటుంది. ఈ పోర్టల్ ను భారత విదేశాంగ శాఖ నిర్వహించనుంది.
గత వారం జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో ఈ మేరకు ఒక వెబ్ పోర్టల్ ను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కమిటీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖల నుంచి ఒక్కరేసి చొప్పున అధికారులున్నారు.

విదేశాల్లో భర్త వదిలేసినా, స్వదేశంలో మోసానికి గురై విడాకులు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, మనోవర్తి పొందాలనుకునే బాధిత మహిళలకు కేంద్రం తీసుకురానున్న ఈ వెబ్ పోర్టల్ సహాయకారిగా ఉంటుంది.
ఎన్నారై భర్తల గురించి పలు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గత ఏడాది ఏర్పాటైన ఈ కమిటీ.. బాధితులకు అభివృద్ధి చెందిన దేశాల్లో 3 వేల డాలర్లు, వర్థమాన దేశాల్లో 2 వేల డాలర్లు ఆర్థిక సాయం చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
-
మొబైల్ డేటాపై కేంద్రం పన్ను? GB పై ఎంత ట్యాక్స్? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications