ఇది చారిత్రాత్మక బడ్జెట్: ప్రధాని మోడీ హర్షాతిరేకం
బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రధాన్యం ఇచ్చారని, ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణం, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసినట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని, ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కి అభినందనలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ బడ్జెట్ ను అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చేదిగా అభివర్ణించారు.
బడ్జెట్ 2017-18 పూర్తి వివరాలు
బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రధాన్యం ఇచ్చారని, ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణం, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసినట్లు తెలిపారు.
ఈ బడ్జెట్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే బడ్డెట్ లక్ష్యమని అన్నారు. ఇంకా త్వరలో అందరికీ సొంత ఇంటి కల నెరవేరుతుందన్నారు.
అంతేకాకుండా ఈ బడ్టెట్ అభివృద్ధికి బాటలు పరిచే బడ్జెట్ అని పేర్కొంటూ, ఆర్థిక వ్యవస్థలో నల్లధన నియంత్రణకు కృషి నిరంతరం జరుగుతూనే ఉంటుందని, ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.