ఆర్మీ డాగ్ జూమ్ కన్నుమూత.. కాలు, మొహనికి గాయంతో ఆస్పత్రిలో చికిత్స
ఇండియన్ ఆర్మీకి చెందిన జూమ్ డాగ్ చనిపోయింది. అదీ యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో పాల్గొనేది. అలా ఓ ఆపరేషన్ లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అదీ అడ్వాన్స్ ఫీల్డ్ వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. పరిస్థితి విషమించి.. ఇవాళ మద్యాహ్నం చనిపోయింది.
ఉదయం 11.45 గంటల వరకు బానే ఉందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. వైద్యానికి చక్కగా స్పందించిందని చెప్పారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా శ్వాస సంబంధ సమస్య ఎదుర్కొందని వివరించారు. తర్వాత పడిపోయిందని తెలిపారు. జూమ్ డాగ్.. కశ్మీర్ అనంత్ నాగ్ లో పోలీసులతో కలిసి పనిచేసేది. ఓ ఆపరేషన్ లో భాగంగా వెనక కాలు, మొహనికి గాయం అయ్యిందని వివరించారు.
అనంత్ నాగ్ జిల్లా కోకెర్ నాగ్ లో గల తంగ్ పావా గ్రామంలో ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో జూమ్ డాగ్ భద్రతా సిబ్బందికి హెల్ప్ చేసింది. వారికి సాయం చేసి.. గాయపడింది. ఇప్పుడు చనిపోవడంతో.. దానితో వర్క్ చేసి అనుబంధం ఉన్న ఖాకీలు బాధతో ఉన్నారు.