Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవినీతిపై కథనం, బెదిరింపు: జర్నలిస్ట్ అదృశ్యం

కోల్‌కతా: బెంగాలీ డెయిలీకి చెందిన ఓ విలేకరి అదృశ్యమైన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. అదృశ్యమైన విలేకరి అలిపుర్‌దౌర్‌ జిల్లాకు చెందినవాడు.

బెంగాళీ డెయిలి పత్రికకు చెందిన చాయన్‌ సర్కార్‌ అనే విలేకరి ఇటీవల ఓ కళాశాలలో ప్రవేశాల సందర్భంగా జరుగుతున్న అవినీతిని బయటపెట్టే కథనం రాశాడు. దీంతో ఆయనను పలువురు చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి.

Journalist missing in West Bengal

అనంతరం ఆ విలేకరి తనను బెదిరించిన ఎనిమిది మంది పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు వారిని అరెస్టు చేశారు.

ఆ అరెస్టు జరిగిన తర్వాత నుంచి విలేకరి కనిపించకుండా పోయాడు. అతని కోసం గాలిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయన కనిపించకుండా పోయాడని చెప్పారు. అతనిని ఎవరో కిడ్నాప్‌ చేశారని, చాయన్‌ స్కూటర్, పర్సు, పుస్తకం ఒకచోట లభించాయని పోలీసులు తెలిపారు. ఆ కళాశాలలో అవినీతికి పాల్పడిన వారే ఈ ఘటనకు కూడా పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+