వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోవల్ ను రంగంలోకి దించిన మోడీ : 'అస్సాం ఉగ్ర నిందితుల వేట'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : అసోంలో తీవ్రవాద దాడితో కేంద్రం అప్రమత్తమైంది. కోక్రాఝార్ మార్కెట్ పై ఉగ్రవాదులు విరుచుకుపడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 18మంది గాయపడ్డారు. కాగా దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. వెంటనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను రంగంలోకి దింపింది.

ఉగ్రదాడిని నేషనల్ డెమోట్రిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ చేసిన చర్యగానే అనుమానిస్తోంది కేంద్రం. ఈ మేరకు భద్రతను అలర్ట్ ను చేసిన ప్రధాని మోడీ అజిత్ దోవల్ ను అసోంకి పంపించారు. భద్రతా సలహాదారుగా ఎన్నో ఆపరేషన్స్ ను సమర్థవంతంగా నిర్వహించిన దోవల్.. గతంలో బోడోలాండ్ తీవ్రవాదులను అణిచివేయడంలోను సఫలమయ్యారని చెబుతారు.

Modi Sent Ajith Doval to assam

ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్ర కార్యకలాపాలకు తెరదించిన ట్రాక్ రికార్డు దోవల్ కు ఉండడంతో.. తాజా అసోం పరిస్థితులను కూడా దోవల్ నే సమీక్షించాల్సిందిగా మోడీ ఆదేశించారు. దాడికి సంబంధించిన వివరాలను చేధించడంతో పాటు ప్రధాన సూత్రధారులు ఎవరా అన్నదానిపై దోవల్ ఇప్పుడు తన కొత్త ఆపరేషన్ మొదలుపెట్టనున్నారు.

English summary
Modi Sent Ajith Doval to assam to find out the terrorists who are behind the latest attack in the state. from the orders of modi, doval landed in assam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X