ప్రపంచ ఆసక్తి-గూగుల్ సెర్చ్: యూపీ తర్వాత గుజరాత్ ఎన్నికలే
న్యూఢిల్లీ: ఇప్పుడు దేశమంతా గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 22ఏళ్లుగా ఎదురులేకుండా అధికారాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి ఈసారి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీనే ఎదుర్కొంది. అయినా కూడా గుజరాత్లో ఇంతకుముందు కన్నా ఒకటి రెండు సీట్లు తగ్గినా.. బీజేపీ మళ్లీ అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
మోడీ అందానికి రూ.4లక్షల పుట్టగొడగులు: అల్పేష్కు తైవాన్ యువతి కౌంటర్
ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలపై మనదేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఈ ఎన్నికలపై ఆసక్తి చూపడం గమనార్హం. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిందని గూగుల్ పేర్కొంది. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ భారీ విజయం సాధించి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే.
అంతేగాక, ఫ్రెంఛ్, జర్మన్, యూకే జాతీయ ఎన్నికల తర్వాత ఎక్కువగా సెర్చ్ చేసినవి యూపీ ఎన్నికలే కావడం గమనార్హం. యూఏఈలో ఈ ఎన్నికల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాలు, ఒమన్, సౌదీ అరేబియాల్లో కూడా ఈ ఎన్నికల గురించి సెర్చ్ చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఎంసీ(బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికలను కూడా గూగుల్లో సెర్చ్ చేయడం గమనార్హం. కాగా, యూపీ తర్వాత ఇప్పుడు గుజరాత్ ఎన్నికలకే ఆ స్థాయి ప్రాధాన్యత లభించిందని గూగుల్ తెలిపింది.