భర్తలు తాగొస్తే బ్యాట్లతో కొట్టండి: వధువులకు బ్యాట్లను గిఫ్ట్ గా ఇచ్చిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించారు. ఇందులో 700 మంది పెళ్ళికూతుళ్ళకు రాష్ట్ర సామాజిక న్యాయ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి గోపాల్ భార్గవ నూతన వధువులకు వినూత్న బహుమతిని అందించారు.
తాగివచ్చే భర్తలను ముఖ్యంగా తాగి హింసించే భర్తలను కొట్టేందుకు బట్టలు ఉతికే బ్యాట్లను ఆయన బహుకరించాడు. తాను మొత్తం పదివేల బ్యాట్లను తయారు చేయించినట్టు ఆయన చెప్పారు.
భర్తలు గృహా హింసకు పాల్పడితే ఈ బ్యాట్లతో కొట్టండి అని ఆయన చెప్పారు. పోలీసులు ఈ కేసుల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ ఆ బ్యాట్లపై రాసి మరీ ఇచ్చాడు.

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు తాగొచ్చి భార్యలను హింసించడం సర్వసాధారణమైందన్నారు. అలాంటివారికి బుద్దిచెప్పాలంటే ఇలాంటి బ్యాట్లు అవసరమన్నారు మంత్రి. రాష్ట్రంలో గులాబీ గ్యాంగ్ ఆందోళన చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు.
ఇటీవల వైన్ షాపులను మూసివేయాలనే డిమాండ్ చేస్తూ కొంతమంది మహిళలు గులాబీ రంగు చీరలు కట్టుకొని బ్యాట్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. ఇక ముందు కూడ పెళ్ళి కూతుళ్ళకు తాను ఈ బ్యాట్లను బహుకరిస్తానని చెప్పారు మంత్రి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications