భర్తలు తాగొస్తే బ్యాట్లతో కొట్టండి: వధువులకు బ్యాట్లను గిఫ్ట్ గా ఇచ్చిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించారు. ఇందులో 700 మంది పెళ్ళికూతుళ్ళకు రాష్ట్ర సామాజిక న్యాయ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి గోపాల్ భార్గవ నూతన వధువులకు వినూత్న బహుమతిని అందించారు.
తాగివచ్చే భర్తలను ముఖ్యంగా తాగి హింసించే భర్తలను కొట్టేందుకు బట్టలు ఉతికే బ్యాట్లను ఆయన బహుకరించాడు. తాను మొత్తం పదివేల బ్యాట్లను తయారు చేయించినట్టు ఆయన చెప్పారు.
భర్తలు గృహా హింసకు పాల్పడితే ఈ బ్యాట్లతో కొట్టండి అని ఆయన చెప్పారు. పోలీసులు ఈ కేసుల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ ఆ బ్యాట్లపై రాసి మరీ ఇచ్చాడు.

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు తాగొచ్చి భార్యలను హింసించడం సర్వసాధారణమైందన్నారు. అలాంటివారికి బుద్దిచెప్పాలంటే ఇలాంటి బ్యాట్లు అవసరమన్నారు మంత్రి. రాష్ట్రంలో గులాబీ గ్యాంగ్ ఆందోళన చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు.
ఇటీవల వైన్ షాపులను మూసివేయాలనే డిమాండ్ చేస్తూ కొంతమంది మహిళలు గులాబీ రంగు చీరలు కట్టుకొని బ్యాట్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. ఇక ముందు కూడ పెళ్ళి కూతుళ్ళకు తాను ఈ బ్యాట్లను బహుకరిస్తానని చెప్పారు మంత్రి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications