నన్ను పదే పదే రేప్ చేశాడు: ఎమ్మెల్యేపై మహిళ

ధబోలేకు బాగా తెలిసిన కళాశాలలో పనిచేసే బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై శుక్రవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం గురించి ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తనను హెచ్చరించాడని, అభ్యంతరకరంగా తనను ఫొటోలు తీసి వాటిని బయటపెడతానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తున్నామని, ఆరోపణలను ధ్రువీకరించుకున్న తర్వాతనే అరెస్టులు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ధబోల్ తనను తన క్యాబిన్కు మూడు సార్లు పిలిచాడని, ఇది కళాశాల పని పేరుతో తనను 2011, 2013 మధ్య పిలిపించాడని, తనపై అత్యాచారం చేశాడని, కొట్టాడని, అత్యాచారం చేశాడని, ఫొటోలు తీశాడని బాధితురాలు వివరించిదంి. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసు స్టేషన్కు పంపించారు.
ఆ సంఘటనతో బోరవాలిలోని నలంద న్యాయశాస్త్ర కళాశాల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బాధితురాలు ఆ కళాశాలలోనే పనిచేస్తోంది. తమను కళాశాల యాజమాన్యం మోసం చేసిందంటూ విద్యార్థులు ఆరోపణలు చేయడంతో గత నెలలో ఈ కళాశాల వార్తల్లోకి వచ్చింది.












Click it and Unblock the Notifications