చెప్పినట్లుగానే.. మోడీ వీఐపీ కాదని నిరూపించుకున్నారు!
ప్రధాని నరేంద్ర మోడీ మన దేశంలో వీఐపీలు ఎవరూ లేరు.. దేశ ప్రజలందరూ వీఐపీలే అని చెప్పినట్లుగానే చేశారు.
కేదార్నాథ్: ప్రధాని నరేంద్ర మోడీ మన దేశంలో వీఐపీలు ఎవరూ లేరు.. దేశ ప్రజలందరూ వీఐపీలే అని చెప్పినట్లుగానే చేశారు. మోడీ బుధవారం ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు.
ఈ నేపథ్యంలో కేదారేశ్వరుడిని దర్శనానికి వెళుతుండగా మోడీ తన బూట్లు విప్పడానికి కూర్చున్నారు. ఇంతలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి మోడీ సాయంగా వచ్చాడు. అయితే మోడీ అతని చేయిపట్టుకుని వద్దంటూ తన బూట్లు తానే విప్పుకుని ఆలయం లోనికి వెళ్లారు.

దేశవ్యాప్తంగా వీఐపీ మర్యాదల్ని నిషేధించాలని.. భారతీయులందరూ వీఐపీలేనని ఇటీవల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇలా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, 28 ఏళ్లలో కేదార్నాథ్లో రుద్రాభిషేకం జరిపించిన తొలి ప్రధానిగా కూడా మోడీ నిలిచారు. 28 ఏళ్ల క్రితం వీపీ సింగ్ రుద్రాభిషేకం చేశారు. ఆరునెలల శీతకాల విరామం అనంతరం కేదార్నాథ్ ఆలయం సందర్శన ఈ రోజు నుంచి ప్రారంభమైంది.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications