ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలు-మూడోరోజూ ఈడీ ముందుకు రాహుల్-పార్లమెంటులో ఎంపీల నిరసనలు
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ నమోదు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసు, మూడు రోజులుగా ఢిల్లీలో సాగుతున్న విచారణ దేశ రాజధానిని వేడెక్కించాయి. వరుసగా మూడో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అదే సమయంలో రాహుల్ కు మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసనలు చేపడుతోంది. దీంతో ఉద్రిక్త పరరిస్ధితులు తలెత్తుతున్నాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని రెండు రోజులుగా విచారించిన ఈడీ అధికారులు.. ఇవాళ మూడో రోజుకూడా విచారణకు పిలిచారు. దీంతో రాహుల్ గాంధీ.. ఏఐసీసీ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే మూడో రోజు కూడా రాహుల్ పై ఈడీ విచారణకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు, నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో హంగామా సృష్టించారు. ఏఐసీసీ కార్యాలయానికి వస్తున్న కాంగ్రెస్ ఎంపీల్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు పార్లమెంటులో నిరసన తెలిపేందుకు వెళ్లారు. అదే సమయంలో ఈడీ కార్యాలయంలో రాహుల్ విచారణ జరుగుతుండగా. కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరసనలు చేపట్టారు.

ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీ విచారణ కొనసాగుతున్న సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఈడీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఈడీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసి స్ధానిక పీఎస్ లకు తరలించారు. అదే సమయంలో ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు. పార్లమెంటులోకి వెళ్లకుండా తమను ఢిల్లీ సీపీ ఎలా అడ్డుకుంటారో చూస్తామని కాంగ్రెస్ ఎంపీ మానికం ఠాకూర్ హెచ్చరించారు.
-
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications