Rebel MLAs: ఏక్ నాథ్ మాట బీజేపీ వింటుందా ?, మంత్రి పదవులు, ఆశాఖల కోసం డిమాండ్ ?, అయితే !
ముంబాయి/గోవా: మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి లైన్ క్లియర్ అయ్యింది. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవికి రాజీనామా చేసిన వెంటనే బీజేపీ నాయకులు రంగంలోకి దిగారు. శివసేన మీద తిరుగుబాటు చేసి సుమారు 50 మంది ఎమ్మెల్యేలను ఎగరేసుకుని వెళ్లి ప్రస్తుతం గోవాలో మకాం వేసిన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లు కలసి మంత్రి పదవుల పంపకం విషయంలో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే బీజేపీ నాయకులకు, రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే మద్య మంత్రి పదవులు, శాఖల కేటాయింపు విషయంలో చిన్నలొల్లి మొదలైయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి. ఇన్ని రోజులు దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండే ఫోన్ లో ఇలాంటి విషయాలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే ఒక్కరే గోవా నుంచి ముంబాయి వచ్చి మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ తో చర్చలు జరిపి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.

దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండే చర్చలు
మహారాష్ట్రలో బీజేపీ, ఏక్ నాథ్ షిండే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యకముందే మంత్రి పదవుల విషయంలో చిన్న సమస్య మొదలైయ్యిందని తెలిసింది. రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లు కలసి మంత్రి పదవుల పంపకం విషయంలో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

ఏక్ నాథ్ కు దేవేంద్రుడి మనవి
ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు సైలెంట్ గా ఉంటే తరువాత అన్ని మాట్లాడుకుందామని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవంద్ర ఫడ్నవిస్ రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండేకి మనవి చేశారని తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మీరు అడిగిన మంత్రి పదవులు, శాఖలు మీకు కేటాయిస్తామని, అంత వరకు రెబల్ ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకోవాలని ఏక్ నాథ్ షిండేకి దేవేంద్ర ఫడ్నవిస్ మనవి చేశారని సమాచారం.

ఏక్ నాథ్ మాట బీజేపీ వింటుందా ?
శివసేన మీద తిరుగుబాటు చేసి సుమారు 50 మంది ఎమ్మెల్యేలను ఎగరేసుకుని వెళ్లి ప్రస్తుతం గోవాలో మకాం వేసిన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లు కలసి మంత్రి పదవుల పంపకం విషయంలో ఇన్ని రోజులు ఫోన్ లో చర్చలు జరుపుతున్నారు. అయితే ఏక్ నాథ్ డిమాండ్ లను బీజేపీ నాయకులు వింటారా ? అనే చిన్న అనుమానం మొదలైయ్యింది.

ఏక్ నాథ్ అడుగుతున్న శాఖలు ఇవే
శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే వర్గానికి 13 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ నాయకులు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఏక్ నాథ్ షిండేకి ఉప ముఖ్యమంత్రి పదవి గ్యారెంటీ అని తెలిసింది. అయితే మా వర్గానికి ఆర్థిక శాఖ, పట్టాణాభివృద్ది శాఖ, పీడబ్లూడీ శాఖలు మాకే కావలని ఏక్ నాథ్ షిండే పట్టుబడుతున్నారని తెలిసింది. ఈ శాఖలు మొదట సీఎం దగ్గర పెట్టుకుని తరువాత ఆ శాఖలు వేరే నాయకులకు ఇవ్వాలని బీజేపీ నాయకులు అంటున్నారని తెలిసింది.

అన్ని శాఖలు ఇచ్చేస్తే మేమే ఏం చెయ్యాలి ?
ముఖ్యమైన ఆర్థిక శాఖ, పట్టాణాభివృద్ది శాఖ, పీడబ్లూడీ శాఖలు ఏక్ నాథ్ షిండే వర్గానికి ఇచ్చేస్తే తరువాత మేము ఏం చెయ్యాలని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారని తెలిసింది. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే ఒక్కరే గోవా నుంచి ముంబాయి వచ్చి మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ తో చర్చలు జరిపి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications