శుభవార్త: వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బిఐ
న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బిఐ ప్రకటించింది. పది నెలల వ్యవధిలో ఎస్బీఐ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. నవంబర్ 1వ, తేది నుండి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయని ఎస్బిఐ తెలిపింది.
అన్ని రకాల వడ్డీరేట్లపై 5 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ఎస్బిఐ ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ కింద ఉన్న రుణాలపై ఇప్పటి వరకు ఏడాదికి 8%వడ్డీ రేటు ఉండగా దాన్ని 7.95%కి కుదించింది.
అదే విధంగా వివిధ కాలవ్యవధితో తీసుకునే రుణాలపై 0.05 శాతం వడ్డీని తగ్గించింది. తాజా రేట్లు కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. ఎంసీఎల్ఆర్ వ్యవస్థ కింద రుణాలు తీసుకున్న వారు మాత్రం కొంత సమయం వేచి ఉండాల్సి ఉంది.వడ్డీ రేట్ల తగ్గింపుతో రుణాలు తీసుకొన్న వారికి కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.