నీళ్లూ పంచుకోవాలిగా, మళ్లీ మొదటికా: ఏపీ-టీ కృష్ణా జలవివాదంపై కోర్టు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆస్తులు, అప్పులు పంచినట్లే నీళ్లు కూడా పంచుకోవాలని, వారసులు తమ తల్లిదండ్రుల నుండి కాకుండా ఇతరుల నుండి ఆస్తులు కోరుకోరు కదా అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కృష్ణా జలాల వివాదంపై సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ఉమ్మడి ఏపీకి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయించిన నీటిని ఇప్పుడు తెలంగాణ, ఏపీ పంచుకోవాలేమో? మరో రాష్ట్రం విడిపోతే మళ్లీ మొదటి నుండి వాదనలు వినాల్సి వస్తుందేమో? ప్రాథమికంగా చూస్తే రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు జరపాలేమో అనిపిస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ, తెలంగాణ, కర్నాటకలు దాఖలు చేసిన ఎస్ఎల్పీ విచారణార్హత పైన బుధవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల పంత్లతో కూడిన ధర్మాసనం ముందు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
బ్రిజేష్ ట్రైబ్యునల్ అవార్డుపై సుప్రీంలో ఎస్ఎల్పీ4లు దాఖలు చేసే అర్హత ఎవరికీ లేదని మహారాష్ట్ర పేర్కొంది. నదీ జలాల వివాదాలపై గతంలోను సుప్రీం తీర్పులు వెలువరించిందని ఏపీ చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఆసక్తికర పై వ్యాఖ్యలు చేశారు. కాగా, వాదనలు పూర్తిగా వినాల్సి ఉందని చెబుతూ పిటిషన్ల విచారణ అర్హత గురించి ప్రస్తావించకుండా కేసును మే 6వ తేదీకి వాయిదా వేశారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications