నీళ్లూ పంచుకోవాలిగా, మళ్లీ మొదటికా: ఏపీ-టీ కృష్ణా జలవివాదంపై కోర్టు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆస్తులు, అప్పులు పంచినట్లే నీళ్లు కూడా పంచుకోవాలని, వారసులు తమ తల్లిదండ్రుల నుండి కాకుండా ఇతరుల నుండి ఆస్తులు కోరుకోరు కదా అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కృష్ణా జలాల వివాదంపై సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ఉమ్మడి ఏపీకి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయించిన నీటిని ఇప్పుడు తెలంగాణ, ఏపీ పంచుకోవాలేమో? మరో రాష్ట్రం విడిపోతే మళ్లీ మొదటి నుండి వాదనలు వినాల్సి వస్తుందేమో? ప్రాథమికంగా చూస్తే రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు జరపాలేమో అనిపిస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ, తెలంగాణ, కర్నాటకలు దాఖలు చేసిన ఎస్ఎల్పీ విచారణార్హత పైన బుధవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల పంత్లతో కూడిన ధర్మాసనం ముందు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
బ్రిజేష్ ట్రైబ్యునల్ అవార్డుపై సుప్రీంలో ఎస్ఎల్పీ4లు దాఖలు చేసే అర్హత ఎవరికీ లేదని మహారాష్ట్ర పేర్కొంది. నదీ జలాల వివాదాలపై గతంలోను సుప్రీం తీర్పులు వెలువరించిందని ఏపీ చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఆసక్తికర పై వ్యాఖ్యలు చేశారు. కాగా, వాదనలు పూర్తిగా వినాల్సి ఉందని చెబుతూ పిటిషన్ల విచారణ అర్హత గురించి ప్రస్తావించకుండా కేసును మే 6వ తేదీకి వాయిదా వేశారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications