ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపేశారు: సైకిల్పై వెళ్తుంటే.. బైక్స్పై వచ్చి!
తొలుత తమతో మాట్లాడాల్సిందిగా యువతిని వేధించిన యువకులు.. ఆపై కత్తులతో దాడి చేసి ఆమెను హత్య చేశారు.
లక్నో: స్కూల్కు వెళ్తున్న ఓ విద్యార్థినిని అడ్డగించిన కొంతమంది దుండగులు.. ఆమెను తీవ్రంగా వేధించారు. తమతో మాట్లాడాలని బలవంతపెట్టారు. అందుకు ఒప్పుకోకపోవడంతో.. అక్కడిక్కడే యువతిని కత్తితో పొడిచి హత్య చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని బాజా అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రగ్నీ దుబే(17) అనే బాలిక.. స్కూల్కు వెళ్తున్న సమయంలో బాన్ దేహీ అనే ప్రాంతం వద్ద.. బైక్స్పై వచ్చిన ఐదుగురు యువకులు ఆమెను అడ్డగించారు.

తమతో మాట్లాడాల్సిందిగా బలవంతం చేశారు. ఇందుకు యువతి ససేమిరా అనడంతో.. సైకిల్ పై ఉన్న ఆమెను కిందకు తోసేశారు. ఆ తర్వాత విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి పరిగెత్తే లోపే.. రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక ప్రాణాలు కోల్పోయింది.
బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుల కోసం వేట ప్రారంభమైంది. నిందితులు కొంతకాలంగా మృతురాలిని వేధిస్తూ వస్తున్నారని పోలీసులు పేర్కొనడం గమనార్హం. బాలిక స్థానికంగా ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిపారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications