అహ్మద్ పటేల్ గెలుపు: నితీష్కు ఝలక్, శరద్ యాదవ్ బిగ్ స్టెప్
బీహార్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీయూలో చీలిక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
పాట్నా: బీహార్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీయూలో చీలిక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
జెడియు నేత, సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే వైపు మొగ్గుతుండగా, జెడియూ అధినేత శరద్ యాదవ్ యూపీఏ వైపు ఉన్నారు. ఇప్పటికే పలు అంశాల్లో వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ రాజ్యసభ ఎన్నికలలోను అది కనిపించింది.
నితీశ్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న శరద్ యాదవ్ సొంత కుంపటి పెట్టే దిశగా సాగుతున్నారు. జేడీయూను చీల్చి తన మద్దతుదారులతో కొత్త పార్టీ పెట్టే దిశగా సాగుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అహ్మద్ పటేల్కు అభినందలు తెలుపడం ద్వారా శరద్ యాదవ్ ఈ దిశగా పెద్ద ముందడుగు వేశారని భావిస్తున్నారు.
ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలను చిత్తు చేస్తూ అహ్మద్ పటేల్ విజయం సాధించారు. గెలిచిన వెంటనే అహ్మద్కు శరద్ అభినందనలు తెలిపారు. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలుపొందారంటూ ఆయనతో తాను దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications