షీనా బోరా హత్య, మీడియా ఓవర్ యాక్షన్: శివసేన
ముంబై: షీనా బోరా హత్య కేసు తప్ప మీడియాకు వేరే సమస్యలు పట్టడం లేదని శివసేన మండిపడింది. నిత్యం షీనా బోరా హత్య కేసుకు మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని విమర్శించింది. ముఖ్య ఘట్టాలను విస్మరించి షీనా బోరా హత్య కేసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై అశ్చర్యం వ్యక్తం చేస్తున్నది.
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా భావించే మీడియా ఇంత దిగజారిపోతుందని అనుకోలేదని తెలిపింది. ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం చాల బాధగా ఉందని విమర్శించింది. నిత్యం పదేపదే ఇంద్రాణి వెంటపడి వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.
1965 యుద్ధం 50వ వార్షికోత్సవం వివరాలు అంతగా ప్రచారం చెయ్యలేదని, సైనికుల త్యాగాలను పట్టించుకోకుండా ఇంద్రాణికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని మీడియా వార్తలుగా మలుస్తోందని సామ్నా పత్రికలో శివసేన మండిపడింది.

అదే విధంగా విదర్బ, మరాత్ వాడ ప్రాంత ప్రజలను ఎందుకు పట్టించుకోలేదని, వారి సమస్యల గురించి ఎందుకు వార్తలు ప్రసారం చెయ్యడం లేదని ప్రశ్నించింది. ప్రజల సమస్యలు పట్టించుకుని తరువాత ఇంద్రాణి లాంటి వారి వార్తలు ప్రసారం చెయ్యాలని సూచించింది.
ఇంద్రాణి జైలులో ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఏం తాగుతుంది, నిద్రపోతుందా, లేదా, ఆమె ఉంటున్న గదిలో ఫ్యాన్ ఉందా, మంచం ఉందా, టీవీ ఉందా లేదా అని వార్తలు ప్రసారం చేస్తున్నారని, వాటితో ప్రజలకు ఏమి అవసరం అని ప్రశ్నించింది.
కరువు సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించింది. అదే విదంగా సరిహద్దులలో పాక్ పదేపదే కాల్పులు జరుపుతుంటే వాటికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని శివసేన ప్రశ్నించింది. షినా బోరా హత్య కేసు విషయంలో మీడియా ఓవర్ యాక్షన్ చేస్తుందని శివసేన చురకలు అంటించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications