Student: మతం మారాలని హాస్టల్ లో విద్యార్థికి వార్డెన్ టార్చర్, ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి !
చెన్నై/తంజావూర్: హాస్టల్ లో ఉంటున్న యువతి ఇంటర్ చదువుతోంది. కాలేజ్ లో చదువుతున్న యువతి అదే కాలేజ్ లోని హాస్టల్ లోనే ఉంటూ సెలవుల్లో మాత్రమే ఇంటికి వెళ్లి వస్తోంది. హాస్టల్ లో ఉంటున్న సాటి అమ్మాయిలతో కలిసి ఆ యువతి ఇంతకాలం సంతోషంగా కాలేజ్ కు వెళ్లి వచ్చింది. సంక్రాంతి పండుగకు ఇంటికి వస్తానని ఆ యువతి ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. పండుగకు కొన్ని రోజుల ముందు యువతి పురుగల మందు తాగేసింది. తీవ్రఅస్వస్థతకు గురైన యువతిని ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు యువతి కుటుంబ సభ్యులకు హాస్టల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కుటుంబ సభ్యులు, పోలీసులకు తాను ఎందుకు పురుగుల మందు తాగాను అనే విషయం గురించి ఆ యువతి పిన్ టూ పిన్ చెప్పింది. తనను మతం మారాలని మా హాస్టల్ వార్డెన్ తనను టార్చర్ పెట్టాడని యువతి కుటుంబ సభ్యులు, పోలీసులకు చెప్పింది. 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి చికిత్స విఫలమై చనిపోయింది.

హాస్టల్ లో ఉంటున్న ఇంటర్ అమ్మాయి
తమిళనాడులోని అరియలూరులో మరుగానందం అనే ఆయన నివాసం ఉంటున్నాడు. మురుగానందంకు లావణ్య (17) అనే కుమార్తె ఉంది. తంజావూరులోని ప్రముఖ కాలేజ్ లో లావణ్య 12వ తరగతి (ఇంటర్) చదువుతోంది. తంజావూరులోని సెయింట్ మైకేల్స్ బాలికల హాస్టల్ లో లావణ్య ఉంటోంది.

సంతోషంగా కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతి
కాలేజ్ లో చదువుతున్న లావణ్య కాలేజ్ లోని హాస్టల్ లోనే ఉంటూ సెలవుల్లో మాత్రమే ఇంటికి వెళ్లి వస్తోంది. హాస్టల్ లో ఉంటున్న లావణ్య సాటి అమ్మాయిలతో కలిసి సంతోషంగా కాలేజ్ కు వెళ్లి వచ్చింది. ప్రతిరోజు హ్యాపీగా సాటి విద్యార్థులతో కాలేజ్ కు వెళ్లి వస్తున్న లావణ్య హాస్టల్ లో సాటి అమ్మాయిలతో సంతోషంగా కాలం గడిపింది.

పండుగకు వస్తానని చెప్పింది..... హాస్టల్ లో పురుగల ముందు తాగేసింది
తమిళనాడులో సంక్రాంతి పండుగ ఎంత ఘనంగా నిర్వహిస్తారో అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. సంక్రాంతి పండుగకు ఇంటికి వస్తానని లావణ్య ఆమె తండ్రి మురుగానందంకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. పండుగకు కొన్ని రోజుల ముందు జనవరి 9వ తేదీన లావణ్య హాస్టల్ లో పురుగల మందు తాగేసింది. తీవ్రఅస్వస్థతకు గురైన లావణ్యను తంజావూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.

యువతిని విచారించిన తల్లిదండ్రులు, పోలీసులు
లావణ్య పురుగుల మందు తాగేసిన మరుసటి రోజు జనవరి 10వ తేదీన యువతి కుటుంబ సభ్యులకు హాస్టల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. మురుగానందం తంజావూరు చేరుకుని ఆసుపత్రిలో ఉన్న కూతురిని చూసి చలించిపోయాడు. ఆసుపత్రి వైద్యులు సమాచారం ఇవ్వడంతో తిరుకట్టుపల్లి పోలీసులు ఆసుపత్రి చేరుకుని లావణ్యను విచారణ చేసి వివరాలు సేకరించారు.

మతం మారాలని హాస్టల్ వార్డెన్ టార్చర్ చేశాడని !
లావణ్య కొంచెం కోలుకున్న తరువాత తన హాస్టల్ వార్డెన్ సకయమరి (62) తనను క్రైస్తవ మతం స్వీకరించాలని నిత్యం టార్చర్ చేశాడని, మతం మారను అని చెప్పినందుకు తనను హాస్టల్ మొత్తం శుభ్రం చెయ్యాలని టార్చర్ పెట్టాడని లావణ్య ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులకు చెప్పింది. మతం మారను అని చెప్పినందుకు రోజురోజుకు హాస్టల్ వార్డన్ సకయమరి నిత్యం వేధింపులకు గురి చేశారని, అందుకే పురుగుల మందు తాగేశానని లావణ్య వారికి చెప్పింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న లావణ్య జనవరి 19వ తేదీ ప్రాణాలు వదిలేసిందని పోలీసులు అన్నారు. మతం మారాలని లావణ్యను వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ హాస్టల్ వార్డెన్ సకయమరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications