MLAs: విమానంలో వెళ్లిపోతుంటే ఇంటెలిజెన్స్ నిద్రపోయిందా ?, మావాడే మా కొంపముంచాడు, పవార్ ఫైర్ !
ముంబాయి/న్యూఢిల్లీ/ గుహవాటి: మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తున్నా ఆ రాష్ట్ర హోమ్ మంత్రిత్వ శాఖా, ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టలేకపోయాయని, ఎమ్మెల్యేలు దర్జాగా విమానంలో వెళ్లిపోతుంటే వీళ్లు ఏం చేస్తున్నారు, ఇంట్లో దుప్పటి కప్పుకుని గురకపెట్టి నిద్రపోతున్నారా ? అంటూ ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకి సీఎం పదవి ఇవ్వడానికి అప్పట్లోనే అంగీకరించిన ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆయన పార్టీ నాయకుడిని హోమ్ మంత్రి చేశారు. ఏక్ నాథ్ షిండే మరో ముగ్గురు మంత్రులు, అంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ముంబాయి నుంచి సూరత్ వెళ్లిపోతుంటే వాళ్లకు భద్రత కల్పిస్తున్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది హోమ్ శాఖలోని వాళ్ల పైఅధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని శరద్ పవార్ హోమ్ మంత్రిత్వ శాఖ అధికారులను ప్రశ్నించారని తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మ్యాన్ లు ఉంటారు ?, నాయకుల గన్ మ్యాన్ లు రాష్ట్రం వదిలి వెళ్లే ముందు పై పోలీసు అధికారులకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలి, అలా ఎందుకు చెయ్యలేదు, అసలు ఏం జరిగింది ? అంటూ శరద్ పవార్ ఆయన పార్టీకి చెందిన హోమ్ మంత్రిని నిలదీశారని వెలుగు చూసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల రోజు చుక్కలు చూపించిన ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్రలో సోమవారం ఎమ్మెల్యే ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ చేసిన శివసేన ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. క్రాస్ ఓటింగ్ జరిగిందని సీఎం ఉద్దవ్ ఠాక్రే గుర్తించేలోపు మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో ముంబాయి నుంచి సూరత్ వెళ్లిపోయారు. తీరా విషయం తెలుసుకున్న సీఎం ఉద్దవ్ ఠాక్రే షాక్ అయ్యారు.

కొంప ముంచిన ఇంటెలిజెన్స్ అధికారులు
మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించలేకపోయింది. ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన రోజు రాత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముంబాయి ఎయిర్ పోర్టు నుంచి సూరత్ వెలుతున్నారని హోమ్ శాఖ గుర్తించలేకపోయింది.

మండిపడుతున్న శరద్ పవార్
మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తున్నా ఆ రాష్ట్ర హోమ్ మంత్రిత్వ శాఖా, ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టలేకపోయాయని, వీళ్లు ఏం చేస్తున్నారు, ఇంట్లో దుప్పటి కప్పుకుని గురకపెట్టి నిద్రపోతున్నారా ? అంటూ ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.

హోమ్ శాఖ నిద్రపోయిందా ?
ఏక్ నాథ్ షిండే మరో ముగ్గురు మంత్రులు, అంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ముంబాయి నుంచి సూరత్ వెళ్లిపోతుంటే వాళ్లకు భద్రత కల్పిస్తున్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది హోమ్ శాఖలోని వాళ్ల పైఅధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని శరద్ పవార్ హోమ్ మంత్రిత్వ శాఖ అధికారులను ప్రశ్నించారని తెలిసింది.

గన్ మ్యాన్ లు ఏం చేస్తున్నారు ?
మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మ్యాన్ లు, స్పెషల్ ప్రోటెక్షన్ యూనిట్ పోలీసులు ఉంటారు ?, నాయకుల గన్ మ్యాన్ లు రాష్ట్రం వదిలి వెళ్లే ముందు పై పోలీసు అధికారులకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలి, అలా ఎందుకు చెయ్యలేదు, అసలు ఏం జరిగింది ? అంటూ శరద్ పవార్ ఆయన పార్టీకి చెందిన హోమ్ మంత్రిని నిలదీశారని వెలుగు చూసింది.

మావాడే మాకొంప ముంచేశాడు
హోమ్ మంత్రిగా ఉన్న దిలీప్ వాస్లే పాటిల్ మా కొంప ముంచేశాడని శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశారని, హోమ్ మంత్రి దిలీప్ వాస్లే పాటిల్ కు చివాట్లు పెట్టారని తెలిసింది. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకి సీఎం పదవి ఇవ్వడానికి అప్పట్లోనే అంగీకరించిన ఎన్సీపీ నేత శరద్ పవార్ తరువాత ఆయన సొంత పార్టీ నాయకుడు దిలీప్ వాస్లే పాటిల్ ను హోమ్ మంత్రి చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications