లాడెన్ ఆస్తులు వందల కోట్లు, జిహాద్కు వీలునామా!
వాషింగ్టన్: సూడాన్ బ్యాంకుల్లో తన పేరిట ఉన్న 197 కోట్లకు పైగా రూపాయలను, తన ఇంజినీర్ సోదరుడు ఇంజినీరింగ్ కంపెనీ నుంచి తన వాటా కింద అందిన దాదాపు రూ.82 కోట్ల రూపాయలను.. మొత్తం రూ.279 కోట్ల రూపాయల్లో సగ భాగాన్ని ప్రపంచ జీహాది కోసం ఖర్చు పెట్టాలని ఒసామా బిన్ లాడెన్ వీలునామా రాశాడు.
లాడెన్కు చెందిన పత్రాలను తాజాగా విడుదల చేశారు. అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. సూడాన్ బ్యాంకుల్లో మొత్తంలో సగ భాగాన్ని తన తల్లి ఖదీజా ఉమ్కు, తన కుమారుడు సాద్ బిన్ ఉసామాకు చెరి సమానం పంచాలని అందులో సూచించాడు.

అలాగే తన కూతురుతో పాటు తన ముగ్గురు చెల్లెళ్లు, తన పినతల్లులు, వారి పిల్లలకు, తన మామ, వారి పిల్లలకు ఎవరికెంత వాటా ఇవ్వాలో కూడా ఆ వీలునామాలో పేర్కొన్నాడు. సూడాన్ బ్యాంకుల నుంచి డబ్బును డ్రా చేయడంలో సహకరించిన అల్ ఖైదా మిలిటెంట్ మెహ్ ఫౌజ్ ఆల్ వాలిద్కు ఒక శాతం ఇవ్వాలన్నాడు.
కోట్లాది రూపాయల బంగారాన్ని కూడా భార్య, పిల్లలు, చెల్లెలు, చిన్నమ్మలు, మామ, వారి పిల్లలకు వాటాలు వేశాడు. ఈ వీలునామాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు తండ్రి, కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
తాను సూచించినట్లు వాటాల పంపకం జరగకుంటే తన ఆత్మ సమాధిలోనే బందీ అవుతుందని పేర్కొన్నాడు. లాడెన్ 1966కు ముందు ఐదేళ్ల పాటు సూడాన్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆప్ఘనిస్తాన్ వెళ్లిపోయాడు. 2011లో పాక్లోని అబొట్టాబాదులో అమెరికా సైనిక దళం చేతిలో హతమయ్యాడు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications