జీహాదీలకు సెక్స్ బానిసల ఎర, ఉత్తేజం కోసం విశృంఖల ధోరణులు...
మిలిటెంట్లపై తమ నియంత్రణను నిలుపుకునేందుకు ఆయా మిలిటెంట్ సంస్థలు పచ్చి దురాగతాలకు పాల్పడుతున్నాయి. అవి కిడ్నాప్ చేసిన మహిళలు, బాలికలను మిలిటెంట్లకు సెక్స్ బానిసలుగా మార్చివేస్తున్నాయి.
లండన్: మిలిటెంట్లపై తమ నియంత్రణను నిలుపుకునేందుకు ఆయా మిలిటెంట్ సంస్థలు పచ్చి దురాగతాలకు పాల్పడుతున్నాయి. అవి కిడ్నాప్ చేసిన మహిళలు, బాలికలను మిలిటెంట్లకు సెక్స్ బానిసలుగా మార్చివేస్తున్నాయి.
జీహాదీ ఫైటర్లను ఆకట్టుకుని, తమ విధ్వంస రచనను కొనసాగించేందుకు ఐఎస్, బోకో హరమ్ సంస్థలు మహిళలు, బాలికలను వారికి ఎరగా వేస్తున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థల దురాగతాలను బ్రిటన్కు చెందిన హెన్రీ జాక్సన్ ఓ నివేదికలో వెల్లడించింది.

లైంగిక వేధింపుల్లోనూ ఉన్మాదం...
కొత్తగా ఉగ్రవాద సంస్థల్లోకి రిక్రూట్ చేసుకునే యువతకు, విదేశాల్లో ధ్వంస రచనలో నిమగ్నమైన వారికి ఉత్తేజం కలిగించేందుకు మహిళలను భార్యలుగా, సెక్స్ బానిసలుగా ఎరవేస్తున్నారని రీసెర్చర్ నికితా మాలిక్ ఒక నివేదికలో పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు తమ ఉన్మాద చర్యల్లోకి లైంగిక వేధింపుల పర్వాన్ని కూడా తీసుకువచ్చాయని వ్యాఖ్యానించారు.

నరకకూపంలో మగ్గుతూ...
నైజీరియాలోని బోకోహరం, సిరియాలో ఐసిస్ సంస్థలు ఇలాంటి విశృంఖల ధోరణులతో సాగుతున్నాయి. 2009లో బోకోహరం ఇస్లామిస్ట్ మిలిటెంట్లు నైజీరియాలోని వేలాది మహిళలు, బాలికలను అపహరించగా వారంతా నరకకూపంలో ముగ్గుతున్నారు.

జీహాదీల తయారీ ప్రక్రియలో...
మరో ఉగ్రవాద సంస్థ బోకోహరామ్.. 2014 ఏప్రిల్లో ఓ స్కూల్ నుంచి 200 మందికి పైగా బాలికలను కిడ్నాప్ చేసింది. వారిని కుక్లు, సెక్స్ బానిసలు, చివరికి ఆత్మాహుతి బాంబర్లుగా మార్చివేసింది. ఈ ఉగ్ర సంస్థ కొత్త జీహాదీలను తయారుచేసే ప్రక్రియలో భాగంగా వారిని మరింత ఉత్తేజితుల్ని చేయడం కోసం అమాయక బాలికలు, మహిళలను వాడుకుంటోంది.

నిత్యం నరకం...
2014లోనే సిరియాలోని సింజార్కు సమీపంలోని ఓ గ్రామాన్ని చుట్టుముట్టిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాదాపు 5000 మంది యాజిదీలను ఊచకోత కోశారు. అంతేకాకుండా 7000 మంది మహిళలు, బాలికలను అపహరించారు. అనంతరం వీరిని బలవంతంగా సెక్స్ బానిసలుగా మార్చేసినట్లు తెలుస్తోంది. వీరంతా ఐఎస్ మిలిటెంట్ల వికృత చేష్టలతో నిత్యం నరకం చవిచూస్తున్నారు.

డబ్బు కోసం అమ్మాయిల ఎర...
ఐఎస్, బోకోహరామ్ ఉగ్ర సంస్థలు నిధుల ఊతం లభించకపోవడంతో తమ ఆపరేషన్లను కొనసాగించలేక సెక్స్ ట్రాఫికింగ్, భారీ మొత్తాలను డిమాండ్ చూస్తూ కిడ్నాపింగ్లకు దిగుతున్నాయి. డబ్బు కోసం అమ్మాయిలను ఎరగా వేస్తున్నాయి. సంప్రదాయంగా ఈ ఉగ్ర సంస్థలకు అందే నిధులు పలు కారణాలతో నిలిచిపోవడంతో ఈ చర్యలకు పాల్పడుతున్నాయి. 2016లో కిడ్నాప్ల ద్వారా ఐసిస్ 3 కోట్ల డాలర్లను ఆర్జించినట్టు సమాచారం.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications