ఒక్క ఫోన్ కాల్.. ఆగిపోయిన డీల్! మోదీపై అమెరికా మంత్రి షాకింగ్ కామెంట్స్
అమెరికా, భారత్ మధ్య జరగాల్సిన భారీ వాణిజ్య ఒప్పందం ఎందుకు నిలిచిపోయిందనే అంశంపై అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లూట్నిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లూట్నిక్ తాజాగా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ సకాలంలో పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేయకపోవడమేనని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా డీల్స్ను క్లోజ్ చేసే నాయకుడని, ఎదుటి పక్షం నేత నేరుగా సంప్రదించినప్పుడే ఆయన ఒప్పందాలను ఖరారు చేస్తారని లూట్నిక్ వివరించారు. భారత్తో ఒప్పందం మొదట జరుగుతుందని తాము భావించామని, కానీ మోదీ నుంచి కాల్ రాకపోవడంతో ఆ సమయాన్ని ఇతర దేశాలతో ఒప్పందాల కోసం కేటాయించాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.
ట్రైన్ స్టేషన్ దాటిపోయింది..
భారత పక్షం నేరుగా మాట్లాడటానికి కొంత అసౌకర్యంగా భావించిందని.. ఆ లోపు అమెరికా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలతో వేగంగా చర్చలు జరిపి షరతులను ఖరారు చేసుకుందని టూట్నిక్ వెల్లడించారు. సుమారు 3 వారాల తర్వాత భారత్ మళ్లీ చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ.. అప్పటికే పరిస్థితులు మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. "అప్పటికే రైలు స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది" అని చెబుతూ, ఇతర దేశాలతో అప్పటికే ఖరారైన షరతులను మార్చడానికి భారత్ ప్రయత్నించడం సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు.

భారత్ ఎగుమతులపై ప్రభావం
ప్రస్తుతం అమెరికాకు భారత్ నుంచి జరిగే ఎగుమతులపై దాదాపు 50 శాతం వరకు టారిఫ్ (సుంకాలు) అమలవుతున్నాయి. ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ సకాలంలో జరిగి ఉంటే, భారతీయ ఎగుమతిదారులకు భారీ ఊరట లభించేది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ఈ ఒప్పందం కుదరకపోవడం భారత వాణిజ్య రంగానికి కొంత ప్రతికూలంగా మారింది.
🚨 India’s trade deal wasn’t finalized because PM Narendra Modi did not call Donald Trump, claims US Commerce Secretary Howard Lutnick.
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 9, 2026
“I set the deal up, but Modi didn’t call—India was uncomfortable,” Lutnick said.
👉 One more proof that India did not BOW DOWN 🔥 pic.twitter.com/xmCvsKKmTd
అసలు ఇబ్బందులు ఎక్కడ?
అమెరికా వాదన ప్రకారం.. భారత్ తన మార్కెట్లను అమెరికా ఉత్పత్తుల కోసం పూర్తిగా తెరవడం లేదని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోందని ఆరోపిస్తోంది. మరోవైపు భారత్ తన రైతుల, స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను పక్కనబెట్టి ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఈ 'ఈగో', 'పాలసీ' వార్ కారణంగానే వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నప్పటికీ వాణిజ్య పరంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.
-
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
టీ తోటల్లో ప్రధాని మోదీ- అట్నుంచి నరుక్కొస్తున్నారు మరి -
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
గెట్ అవుట్: నమ్మకమైన స్నేహితురాలికే ట్రంప్ షాక్. -
H1B Visa: 85 వేల మందికి లక్కీ ఛాన్స్, సెలెక్షన్ లిస్ట్ వచ్చేసింది! -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు










Click it and Unblock the Notifications