పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే..
పాకిస్థాన్ తన వింత వింత చేష్టలతో నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. చమురు, గ్యాస్ ధరలను భారీగా పెంచేసింది అక్కడి ప్రభుత్వం. తాజాగా అక్కడి ప్రజలపై మరో భారం మోపింది. అదే 'గోబర్ టాక్స్' పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వం ఈ వింత పన్ను ప్రవేశపెట్టింది. ఈ టాక్స్ ప్రకారం.. ఒక్కో గేదె లేదా ఆవుపై రోజుకు 30 PKR గోబర్ టాక్స్ చెల్లించాలని ఆదేశాలిచ్చింది. అంటే 10 గేదెలు ఉన్న వ్యక్తి నెలకు 9వేల PKR కట్టాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో పంజాబ్ ప్రభుత్వం నిర్ణయంపై మీమ్స్, రీల్స్ చేస్తున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్థాన్ లో చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రజలపై మరో భారాన్ని మోపింది అక్కడి ప్రభుత్వం. గోబర్ టాక్స్ పేరుతో వింత పన్ను ప్రవేశపెట్టింది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. 'స్వచ్ఛ పంజాబ్' కార్యక్రమం కింద వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం సర్వీస్ ఫీజుగా వసూలు చేయనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ అన్న కూతురు మరియం నవాజ్ ఇక్కడ సీఎం కావడం గమనార్హం. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో గేదెల జనాభా అధికంగా ఉన్న 168 ప్రాంతాల్లో ఈ పన్ను ప్రవేశపెట్టారు. ఆవు లేదా గేదె పేడతో బయోగ్యాస్ ను తయారు చేసి కుకింగ్, ఎలక్ట్రిసిటీ తయారీకి వినియోగిస్తున్నారు. వేస్ట్ టూ వ్యాల్యూ కింద పంజాబ్ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే పన్ను నుంచి తప్పించుకునేందుకు గేదెలకు డైపర్లు తొడుగుతున్నారట యజమానులు..
#DNAमित्रों | पाकिस्तान में अब 'गोबर टैक्स' चल रहा है.. भारत में सब नॉर्मल.. पाकिस्तान में 'गोबर'!#DNA #DNAWithRahulSinha #Pakistan #GobarTax @RahulSinhaTV pic.twitter.com/VS8ZpC5bVB
— Zee News (@ZeeNews) April 3, 2026
ఇక ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య మొదలైన యుద్ధం ఆ దేశాల్నే కాకుండా ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తోంది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు తాజాగా పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వినియోగదారుల సూచీ గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 7 శాతం ఉండగా మార్చి పూర్తయ్యేనాటికి 7.3 శాతానికి చేరింది. ఇక ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం రేటు కేవలం 5.8 శాతంగా ఉంది. యుద్ధం ప్రారంభం నుంచి క్రమంగా ఆదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోబర్ టాక్స్ తో అక్కడి ప్రజలపై మరో భారాన్ని మోపింది ప్రభుత్వం.
-
పెట్రోల్ పై రూ. 80 తగ్గింపు: బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications