ఉగ్రవాదుల దాడి: తిరిగి ప్రారంభమైన పెషావర్ సైనిక పాఠశాల
న్యూఢిల్లీ: పెషావర్లోని ఉగ్రవాద దాడిలో రక్తం చిందించిన సైనిక పాఠశాల సోమవారం తిరిగి ప్రారంభమైంది. డిసెంబర్ 16న పాకిస్ధాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులు పెషావర్లోని పాఠశాల్లోకి చొరబడి ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదుల దాడిలో 132 మంది బాలలు సహా మొత్తం 140 మందిని చంపడం యావత్ ప్రపంచానే కలచివేసిన సంగతి తెలిసిందే. దాడి నేపథ్యంలో పాకిస్ధాన్ ప్రభుత్వం ఈ పాఠశాలను మూసివేసింది. అంతే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని పాఠశాలలు కొన్ని రోజుల పాటు మూతపడ్డాయి.
ఉగ్రవాదుల దాడుల్లో రక్తపుమడుగుల్లా మారిని తరగతి గదులను పుర్తిగా శుభ్రం చేసి... పాఠశాల్లో ధ్వంసమైన ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టారు. పాక్లోని మిగతా పాఠశాలలు కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. తాజాగా పెషావర్ సైనిక పాఠశాల సోమవారం ఉదయం తలుపులు తెరచుకుని తన విద్యార్ధులకు బోధనను ప్రారంభించింది. పాక్లోని ప్రముఖ విద్యా సంస్థల వద్ద సాయుధులైన భద్రత సిబ్బందిని మోహరించారు.