జర్నలిస్ట్ రఘు లేఖాస్త్రం: ప్రధాని మోడీకి 5 అంశాల గురించి ప్రస్తావన, రక్షించాలని వేడుకోలు
జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్య లక్ష్మీ ప్రవీణ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే రఘు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారని సోషల్ మీడియాలో మేసెజ్ ఫార్వార్డ్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వ అక్రమాల గురించి అందులో ప్రస్తావించినట్టు ఉంది. రఘు రాసిన లేఖలో ఏముందో చుద్దాం పదండి.
తెలంగాణలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాను అని రఘు లేఖను ప్రారంభించారు. నిన్న(గురువారం) ఉదయం తన ఇంటి సమీపంలో కొందరు కిడ్నాప్ చేశారు. ఐదు అంశాల గురించి వార్తల ప్రసారం ఆపితేనే నేను ప్రాణాలతో బతుకుతానని చెప్పారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసినవారు పోలీసులని తెలిసింది. సోషల్ మీడియాలో నా కిడ్నాప్ అంశం వైరల్ కావడంతో నన్ను వారు కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. ప్రస్తుతం నేను జైలు నుంచి మీకు ఈ లేఖ రాస్తున్నాను. కిడ్నాప్ చేసిన పోలీసులు.. నన్ను వార్తలు ప్రసారం చేయొద్దని కోరిన 5 అంశాలు.
1. పుప్పాలగూడ కాందీశీకుల భూమి ఆక్రమణ.
2. ఐడీపీఎల్ 500 ఎకరాల ఆక్రమణ.
3. ఐకియా ముందు 43 ఎకరాల భూమి ఆక్రమణ.
4. ప్రాజెక్టుల దోపిడి.
5. కార్పొరేట్ హాస్పిటల్స్లో కరోనా ట్రీట్మెంట్ దోపిడి.

100 ఎకరాల భూమి..
పుప్పాలగూడలో 100 ఎకరాల కాందీశీకుల భూమి ప్రస్తుతం ఆక్రమణకు గురవుతోంది. ఈ భూమి విలువ రూ.50 వేల కోట్లు. రైతులను బెదిరించి, నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూకబ్జా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అధికార పార్టీ నేతలు, వారి బంధు మిత్రులు. చట్ట వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలకు అనుమతిలిస్తున్నారు. ఆ విషయం గురించి రిపోర్ట్ చేయకూడదట.

500 ఎకరాల ల్యాండ్
ఐడీపీఎల్/ హిందుజ /గల్ప్ ఆయిల్కు చెందిన 500 ఎకరాల భూమిని మింగుతున్నారు ప్రభుత్వ పెద్దలు. దీని విలువ రూ.10 వేల కోట్లు. ఈ విషయం గురించి కూడా నేను మాట్లాడకూడదట. ఇదే అంశంపై బెదిరిస్తున్నారని వాపోయాడు.

ప్రైవేట్ చేతికి ఎలా
హైటెక్ సిటీ సమీపంలో ఐకియాకు ముందు యూఎల్సీకి సరెండర్ చేసిన 35,36,47,53 సర్వే నెంబర్ల భూమి ప్రభుత్వం చేతిలో నుంచి ప్రైవేట్ చేతిలోకి ఎలా వచ్చిందో ప్రశ్నించకూడదట.

60 వేల కోట్ల అవినీతి
రాష్ట్రంలో మిషన్ భగీరథతో పాటు ప్రాజెక్టులన్నింటిలో రూ.60 వేల కోట్ల అవినీతి జరిగింది. ఆ డబ్బంతా రాజకీయ నాయకులకు చేరింది. పక్క రాష్ట్రం కర్ణాటకతో పోలిస్తే అదే కాంట్రాక్టర్ చేసిన రేట్లతో పోలిస్తే తెలంగాణ ప్రాజెక్టుల్లో విపరీత దోపిడి జరిగింది. ఆ ప్రాజెక్టులు, టెండర్ల దోపిడి గురించి నేను మాట్లాడకూడదట.

కరోనా పేరుతో దోపిడీ
కరోనా సమయంలో విపరీతమైన దోపిడికి తెగబడి శవాలతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కథనాలను తక్షణం ఆపివేయాలట. వాస్తవానికి ఒక్కో ఆస్పత్రి అడ్వాన్స్ పేరుతో నిలువుదోపిడీ చేసిన సంగతి తెలిసిందే.
Recommended Video

రక్షించండి ప్రభు..
ప్రధానమంత్రిగా మిమ్మల్ని ఈ అంశాలపై దృష్టి సారించాలని కోరుతున్నాను రఘు వేడుకున్నారు. పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛలేని తెలంగాణ పరిస్థితిని మీరు మారుస్తారని ఆశిస్తున్నాను. తన ప్రాణాలకు భద్రత లేదు, నాకు రక్షణ కలిపించాలని రఘు గంజి ప్రధాని మోడీని లేఖలో కోరారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications