1952 తర్వాత ఇలాంటి ఎన్నికలు చూడలేదు: చింతా మోహన్
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ చిందులేశారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ మధ్యలో చేతులెత్తేశాడని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో నిమ్మగడ్డ... ఐస్గడ్డలా కరిగిపోయారని ఎద్దేవా చేశారు. సోమవారం చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నికలను చూడలేదని చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను భ్రాయభ్రాంతులకు గురిచేశారని చింతా మోహన్ మండిపడ్డారు. కర్ణాటక, తెలంగాణ లిక్కర్, ఎర్రచందనం అక్రమ కేసులు పెడతామని పోటీదారులను బెదిరించారని ఆరోపించారు. చాలా చోట్ల భయపెట్టి ఏకగ్రీవాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక, నగర పాలక సంస్థ ఎన్నికలు ఫేక్ ఎన్నికలని చింతామోహన్ చెప్పారు.

రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు ఎన్నికల కమిషనర్ పదవీ చేపట్టకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శుభ పరిణామం అని చెప్పారు. రూ.300 కోట్లతో టీటీడీ చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణం చేస్తామని, ఎన్నికలకు ముందు ఎంఓయూ చేసుకోవడం ఒక రాజకీయ జిమ్మిక్కు అని పేర్కొన్నారు. రూ. 300 రూపాయలు లేని వ్యక్తి, మూడు వందల కోట్లు పెట్టి ఆస్పత్రిని ఎలా నిర్మిస్తారని చింతామోహన్ ప్రశ్నించారు. వాళ్లు చెప్పే మాటలు అబద్దం అని.. మాయ చేస్తున్నారని మండిపడ్డారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications