బీజేపి,టీఆర్ఎస్ ప్రజావ్యతరేక పార్టీలకు బుద్ది చెప్పాలి.!షర్మిళ పార్టీలో చేరిన కమలం,గులాబీ నేతలు.!
హైదరాబాద్ : వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ దూసుకెళ్తోంది. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ పాద యాత్ర ప్రభావం తెలంగాణ రాజకీయాలపైన బాగానే చూపినట్టు తెలుస్తోంది. ఇదే వారంలో ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడనుంచే మళ్లీ మొదలు పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు వైయస్ షర్మిళ. ఈ నేపధ్యంలో తెలంగాణ వైయ్యస్సార్ పార్టీలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు చేరిపోయారు. పాదయాత్ర మళ్లీ పునఃప్రారంభం కానున్న సందర్బంగా మొదలైన చేరికలు పార్టీకి మంచి బూస్టర్ లా పరిణమంచినట్టు తెలుస్తోంది.

షర్మిళ పాదయాత్ర ముందు చేరికలు.. పార్టీకి ఊపునిస్తాయంటున్న నేతలు
వైయ్యస్సార్ తెలంగాణ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతు న్నవైయ్యస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ నాయకత్వంలో పనిచేసేందుకు పలు పార్టీల నాయకులు ముందుకొస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నుండే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పలువురు నాయకులు వైయ్యస్సార్ తెలంగాణ పార్టీలో చేరడం విశేషం. వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ ఆద్వర్యంలో పలువురు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు సోమవారం పార్టీలో చేరారు.

షర్మిళ పార్టీలో చేరికలు.. బీజేపి, టీఆర్ఎస్ నేతలకు కండువా కప్పి ఆహ్వానించిర షర్మిళ
హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు ఎడమ మోహన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మలక్ పేట్ బీజేపీ నాయకులు, ట్రేడర్ సెల్ సిటీ అధ్యక్షులు నవీన్ రావు, మలక్ పేట్ బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ చౌకి తమ అనుచరులతో కలిసి వైయ్యస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిళ వారందరికీ పార్టీ కండువా వేసి వైయ్యస్సార్ తెలంగాణ పార్టీలోకి ఆహ్వానించారు.

కేసీఆర్ ది నియంత పాలన.. చరమగీతం పాడాలన్న టీఆర్ఎప్ నేత
ఈ సందర్భంగా ఎడమ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయ్యస్సార్ వ్యవసాయాన్ని పండుగ చేశారని గుర్తుచేశారు. ఉచిత కరెంటు, రుణమాఫీ, సబ్సిడీలు కల్పించి రైతులను ఆదుకున్నారని పేర్కొన్నారు. పేదలు కార్పొరేట్ వైద్యం పొందాలని ఆరోగ్యశ్రీని పథకాన్ని ప్రవేశపెట్టి వారి బతుకుల్లో ఆనందాన్ని నింపారని తెలిపారు. వైయస్ షర్మిళ నాయకత్వంలో పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు వైయ్యస్సార్ తెలంగాణ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

దివంగత సీఎం వైయస్సార్ ఎన్నో పథకాలకు రూపక్పన చేసారు.. షర్మిళకు అండగా ఉంటాన్న బీజేపి నేత
బీజేపీ నాయకులు నవీన్ రావు, రవి కుమార్ చౌకి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలనలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్ష పార్టీలు సైతం నిలదీయడంలో విఫలమయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయ్యస్సార్ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రజల మనస్సులు తెలుసుకుని ఎన్నో గొప్ప పథకాలను అందించారని గుర్తు చేశారు. వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ తండ్రి తగ్గ తనయగా అధికార పార్టీ వైఫల్యాలను నిలదీస్తూ పాదయాత్రతో ప్రజల మనస్సును తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నవీన్ రావు హామీనిచ్చారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications