స్కూల్ బస్సు ప్రమాదం ఎఫెక్ట్: రికార్డు టైమ్లో బ్రిడ్జీ నిర్మాణం
మెదక్: మెదక్ జిల్లా మూసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద 2014లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గుర్తుండే ఉంటుంది. ఓ ప్యాసెంజర్ రైలు పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సుు ఢీకొట్టడంతో 18 మంది పిల్లల ప్రాణాలు గాలిలో కలిశాయి.
ఆ ప్రమాదం పెట్టిన గుండెకోతను గుర్తు చేసుకుంటూ మెదక్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ ప్రదేశంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మాణానికి పూనుకున్నారు.

వంతెన నిర్మాణానికి సాయం అడిగితే కేంద్రం, రైల్వే శాఖ తిరస్కరించాయి. దాంతో విషయాన్ని ప్రభాకర్ రెడ్డి మంత్రి హరీష్ రావు సహకారంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దృష్టికి తీసుకుని వెళ్లారు.

దాంతో కేసీఆర్ రూ.1.69 కోట్లు మంజూరు చేశారు. అయితే వంతెనల నిర్మాణానికి నెలలే కాదు, సంవత్సరాలు పట్టిన సందర్భాలున్నాయి. అయితే మెదక్ జిల్లా వెల్తుర్తి మండలం మూసాయి పేట రైల్వే క్రాసింగ్ వద్ద కేవలం నాలుగు గంటల్లోనే రోడ్డు, అండర్ బ్రిడ్జి (ఆర్యుబీ)ని పూర్తి చేసి రికార్డు సృష్టించారు.

శుక్రవారం పది గంటలకు రైల్వే లైన్ను తొలగించి, సిమెంట్ బ్లాక్లను ప్లాట్ఫారాలను నిర్మించారు. ఆ వెంటనే రైల్వే లైన్ను తిరిగి బిగించారు. ఈ పనులన్నీ నాలుగు గంటల్లో పూర్తయ్యాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications