స్కూల్ బస్సు ప్రమాదం ఎఫెక్ట్: రికార్డు టైమ్లో బ్రిడ్జీ నిర్మాణం
మెదక్: మెదక్ జిల్లా మూసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద 2014లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గుర్తుండే ఉంటుంది. ఓ ప్యాసెంజర్ రైలు పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సుు ఢీకొట్టడంతో 18 మంది పిల్లల ప్రాణాలు గాలిలో కలిశాయి.
ఆ ప్రమాదం పెట్టిన గుండెకోతను గుర్తు చేసుకుంటూ మెదక్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ ప్రదేశంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మాణానికి పూనుకున్నారు.

వంతెన నిర్మాణానికి సాయం అడిగితే కేంద్రం, రైల్వే శాఖ తిరస్కరించాయి. దాంతో విషయాన్ని ప్రభాకర్ రెడ్డి మంత్రి హరీష్ రావు సహకారంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దృష్టికి తీసుకుని వెళ్లారు.

దాంతో కేసీఆర్ రూ.1.69 కోట్లు మంజూరు చేశారు. అయితే వంతెనల నిర్మాణానికి నెలలే కాదు, సంవత్సరాలు పట్టిన సందర్భాలున్నాయి. అయితే మెదక్ జిల్లా వెల్తుర్తి మండలం మూసాయి పేట రైల్వే క్రాసింగ్ వద్ద కేవలం నాలుగు గంటల్లోనే రోడ్డు, అండర్ బ్రిడ్జి (ఆర్యుబీ)ని పూర్తి చేసి రికార్డు సృష్టించారు.

శుక్రవారం పది గంటలకు రైల్వే లైన్ను తొలగించి, సిమెంట్ బ్లాక్లను ప్లాట్ఫారాలను నిర్మించారు. ఆ వెంటనే రైల్వే లైన్ను తిరిగి బిగించారు. ఈ పనులన్నీ నాలుగు గంటల్లో పూర్తయ్యాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications