సింగరేణి బొగ్గు గనిలో కూలిన పైకప్పు: ఒకరు మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గనిలో గురువారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. వకిల్పల్లి గనిలో పైకప్పు కూలడంతో ఓవర్మెన్ నవీన్ మృతి చెందాడు. మరో ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
గనిలో మూడో సీమ్ 66 లెవల్ 44 డీప్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో ప్రమాద స్థలానికి దగ్గరలో పనిచేస్తున్న ఓవర్మెన్ గల్లంతయ్యాడు. రంగంలోకి దిగిన రెస్కూ బృందాలు నవీన్ మృతదేహాన్ని గుర్తించి బయటికి తీశాయి.

ఘటన సమయంలో అక్కడే ఎల్హెచ్డీ యంత్రంపై పనిచేస్తున్న ఆపరేటర్ వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు.
I am praying and hoping that our singareni brother Naveen who is currently trapped in the Vakeelpalli mine due to a mishap is rescued safely and swiftly @PRO_SCCL
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 29, 2020
కాగా, సింగరేని కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) అనేది ప్రభుత్వ రంగ బొగ్గు మైనింగ్ సంస్థ. ఇది తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం సంయుక్తంగా యాజమాన్యంలో ఉంది. ప్రస్తుతం, ఎస్సిసిఎల్ తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో 18 ఓపెన్కాస్ట్, 27 భూగర్భ బొగ్గు గనులను 48,000 మందికి సిబ్బందితో నిర్వహిస్తోంది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications