చిన్నారి రమ్య మృతి: బిటెక్ విద్యార్థికి పోలీసు కస్టడీ
హైదరాబాద్: చిన్నారి రమ్య మృతి కేసులో బిటెక్ విద్యార్థి శ్రావెల్ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చిన్నారి రమ్య మృతికి, కారు ప్రమాదానికి కారణమై ఇంజినీరింగ్ విద్యార్థి శ్రావెల్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దానిపై స్పందించిన కోర్టు శ్రావెల్ను రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ నాంపల్లి కోర్టు అనుమతించింది. రేపు మంగళవారంనాడు కస్టడీకి తీసుకొని ఈ నెల 14న కోర్టులో హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. కారు ప్రమాదంలో గాయపడిన రమ్య తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే.
బిటెక్ విద్యార్థి శ్రావెల్ నడిపిన కారు ప్రమాదానికి గురై మరో కారుపై పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన చిన్నారి రమ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

కాగా, రమ్య మృతికి నివాళులు అర్పిస్తూ సోమవారం సాయంత్రం హైదరాబాదులోని కెబిఆర్ పార్కు వద్ద కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా పాల్గొన్నారు. రమ్య తాత, ఇతర కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
కారు ప్రమాదానికి కారణమై, ఇద్దరి మృతికి బాధ్యుడైన బిటెక్ విద్యార్థి శ్రావెల్ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రమ్య మృతికి నివాళులు అర్పిస్తూ హైదరాబాదులో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications