ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య: పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం..
మూసాపేట: పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కూకట్పల్లి రాజీవ్గాంధీ నగర్లోని స్వరూప్, కవితల కుమార్తె ప్రియాంక(18) నగరంలోని షేక్పేటలోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

ప్రియాంక తండ్రి వ్యాపారం చేస్తుంటారు. తల్లి గృహిణి. ప్రియాంక చదువు కోసం తల్లిదండ్రులు భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఆ అంచనాలను అందుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ పరిశీలిస్తే తెలుస్తోంది.
మంగళవారం సాయంత్రం సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అవడం తనను బాధించిందని, తన చదువుకు తల్లిదండ్రులు ఏటా రూ.11లక్షలు చేస్తున్నారని లేఖలో ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications