రూ. కోటి 10 లక్షల లంచం: ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్, అరెస్ట్
మేడ్చల్: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి మరో అవినీతి తిమింగలం చిక్కింది. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఏఎస్రావు నగర్లోని ఆయన నివాసంలో కోటీ 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. నాగరాజును అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. నాగరాజు ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

రాంపల్లి ప్రాంతంలో 28 ఎకరాల భూ సెటిల్మెంట్ల విషయంలో పెద్ద మొత్తంలో ఈ లంచం తీసుకుంటూ ఉండగా.. ఏసీబీ అధికారులు నాగరాజును పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏసీబీ చరిత్రలోనే ఇదే అతి పెద్ద ట్రాప్గా తెలుస్తోంది.
తహసీల్దార్ నాగరాజు సహా రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్, కన్నడ అంజిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, గతంలో ఈ ఎమ్మార్వోపైనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉందని తెలిసింది. మూడు నెలల క్రితమే ఆ కేసు నుంచి విముక్తి పొందినట్లు అధికారులు తెలిపారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications