రూ. కోటి 10 లక్షల లంచం: ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్, అరెస్ట్
మేడ్చల్: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి మరో అవినీతి తిమింగలం చిక్కింది. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఏఎస్రావు నగర్లోని ఆయన నివాసంలో కోటీ 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. నాగరాజును అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. నాగరాజు ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

రాంపల్లి ప్రాంతంలో 28 ఎకరాల భూ సెటిల్మెంట్ల విషయంలో పెద్ద మొత్తంలో ఈ లంచం తీసుకుంటూ ఉండగా.. ఏసీబీ అధికారులు నాగరాజును పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏసీబీ చరిత్రలోనే ఇదే అతి పెద్ద ట్రాప్గా తెలుస్తోంది.
తహసీల్దార్ నాగరాజు సహా రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్, కన్నడ అంజిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, గతంలో ఈ ఎమ్మార్వోపైనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉందని తెలిసింది. మూడు నెలల క్రితమే ఆ కేసు నుంచి విముక్తి పొందినట్లు అధికారులు తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications