‘మీరెటు వెళుతున్నారు?’: సండ్ర, కేటీఆర్ల మధ్య ఆసక్తికర సంభాషణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డితోపాటు పలువురు నేతలు, భారీ ఎత్తును కార్యకర్తలు కాంగ్రెస్ చేరుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
Recommended Video


చేరికల నేపథ్యంలో..
రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆయనతో వచ్చే పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అంతేగాక, తనవెంట వచ్చేవారి జాబితాను కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే పంపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సండ్ర, కేటీఆర్ సంభాషణకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎటు వెళుతున్నారు..?
కాగా, సోమవారం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో మంత్రి కేటీఆర్ కాసేపు సరదాగా సంభాషించారు. టీడీపీ వలసల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘మీరు ఎక్కడికి వెళుతున్నారు' అని సండ్రను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.

ఎటూ వెళ్లడం లేదు...
ఇందుకు సమాధానంగా ‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు' అని సండ్ర వెంకటవీరయ్య మంత్రికి సమాధానం ఇచ్చారు. రేవంత్ రెడ్డితో పలువురు టీడీపీ నేతలు వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు.

అసత్య ప్రచారం.. రేవంత్తో నష్టం లేదు..
కొత్తకోట దయాకర్రెడ్డి, సీతక్క పార్టీ మారుతారని వస్తున్న వార్తలు అవాస్తవమని, వారిద్దరూ తమ పార్టీలోనే ఉంటారని ఈ సందర్భంగా సండ్ర స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వెళ్లడం వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు.
-
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications