నయీం ఎన్కౌంటర్పై కవిత, సిబిఐకి అప్పగింతకి ఎందుకివ్వాలంటే.. అలీ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ను రాజకీయం చేయవద్దని నిజామాబాద్ ఎంపీ, తెరాస నాయకురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజుల క్రితం నయీంను మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.
కొత్త జిల్లాలపై కేబినెట్ కమిటి భేటీ
పరిపాలన సౌలభ్యం కోసం చిన్న చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తున్నమని కవిత అన్నారు. కొత్త జిల్లాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.

పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సబ్ కమిటీకి తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ తోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నయీం కేసు సీబీఐకి అప్పగించాలి
గ్యాంగ్ స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అయిదు రాష్ట్రాలలో నయీంతో సంబంధాలు ఉన్న వారిని ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) విచారించగలదా అని నిలదీశారు. సీనియర్ అధికారులను జనియర్ అధికారి ఎలా ప్రశ్నిస్తారన్నారు. నయీం డైరీలోని పేర్లు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications