పిల్లల్లో కరోనా కొత్త లక్షణాల గుర్తింపు; గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చేరిన ఐదుగురు చిన్నారులు
కరోనా మహమ్మారి భారతదేశంలో తన పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా కరోనా మహమ్మారి కేసులు విజృంభిస్తున్నాయి. తేలికపాటి లక్షణాలతో ఒమిక్రాన్ కొనసాగుతున్నా ముందు ముందు దీని ప్రభావం ఏవిధంగా ఉంటుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పిల్లల పైన కూడా కరోనా ప్రభావం చూపిస్తుంది.

పిల్లలపై కరోనా ప్రభావం ..కొత్త లక్షణాలు గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి పిల్లలపై ప్రభావం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరోనా మహమ్మారి బారిన పడిన పిల్లలు డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒకటి, రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొందరు చిన్నారులకు కడుపునొప్పి రావడంతో పాటు వాంతులు, విరోచనాలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డెల్టా వేరియంట్ తో బాధ పడిన పిల్లలలో కడుపునొప్పి, తలనొప్పి ఉండేది కాదని, కానీ ప్రస్తుతం కరోనా బారిన పడిన పిల్లలలో కడుపు నొప్పి, తలనొప్పి విపరీతంగా ఉంటుందని చెప్తున్నారు.

కడుపునొప్పి, తలనొప్పితో చిన్నారులలో లక్షణాలు
సహజంగా కరోనా మహమ్మారి బారిన పడిన పిల్లలు సహజంగా జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాకుండా కొత్తగా కడుపునొప్పి, తలనొప్పి తో కూడా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులలో ఏ మాత్రం ఈ లక్షణాలు కనిపించినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా పరీక్షలు చేయించి అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా మూడవ దశలో 5 సంవత్సరాల లోపు పిల్లల పై కూడా ప్రభావం ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

5 ఏళ్ళ పిల్లలపైనా ప్రభావం
ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు మాస్కులు పెట్టినా వారు ఉంచుకోరని కిందకి లాగేసి ఉంటారని, దీంతో వారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు టీకాలు ఇంకా అందుబాటులోకి రాని కారణంగా చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం తల్లిదండ్రులకు ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి పిల్లల వార్డులో ఐదుగురు పిల్లలు కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు.

ఐదుగురు చిన్నారులకు కరోనా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స
వీరిలో ఇద్దరికి ఆక్సిజన్ తో చికిత్స అందిస్తుండగా మరో ముగ్గురు ఇతర సమస్యలతో చికిత్స పొందుతున్నారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలో 23 నుండి 30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు. ఇండియాలో కూడా పిల్లలు ఒమిక్రాన్ బారిన పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పిల్లల్లో తలనొప్పి, 101, 102 డిగ్రీల జ్వరం, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. తస్మాత్ జాగ్రత్త అని వార్న్ చేస్తున్నారు వైద్య నిపుణులు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications