హైదరాబాద్ విధ్వంసానికి ఐసిస్ కుట్ర: అజ్మీర్లో ఉగ్రవాదుల మకాం
హైదరాబాద్: హైదరాబాదులో తమ చేతికి చిక్కిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు అజ్మీర్లో కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించారని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ గుర్తించింది. దీంతో తమకు ఇటీవల పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదులను ఇద్దరిని తీసుకుని వెళ్లి అజ్మీర్లో సోదాలు చేశారు.
హైద్రాబాద్లో భారీ పేలుళ్లకు ఐసిస్ కుట్ర: మరో ఇద్దరు అరెస్ట్
అజ్మీర్లో ఐసిస్ అనుమానితులు రెక్కీ నిర్వహించారని, అక్కడ దర్బార్ ప్యాలెస్లో మకాం వేశారని ఎన్ఐఎ అధికారులు గుర్తించినట్లు సమాచారం. సిరియాకు చెందిన ఐఎస్ఐఎస్ నాయకుడితో అక్కడి నుంచి వీరు మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు.

ఐసిస్ చీఫ్ సూచనల మేరకే వారు ఇక్కడ మకాం వేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఎన్ఐఎ అధికారులు తమ చేతుల్లో ఉన్న అనుమానితుల నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. దర్బార్ ప్యాలెస్ నుంచి సిసిటివీ కెమెరా దృశ్యాలను ఎన్ఐఎ అధికారులు సేకరించారు.
హైద్రాబాద్లో 'కొత్త'వ్యూహంతో విధ్వంసంకు ఐసిస్ ప్లాన్
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలోనూ మహారాష్ట్రలోని నాందేడ్లోనూ ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐసిస్ అనుమానితులు దేశంలో ఎక్కడెక్కడ మకాం వేశారు, ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎన్ఐఎ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఎక్కడెక్కడ కొన్నారనే విషయాన్ని కూడా రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications