వేముల రోహిత్ ఎఫెక్ట్: వీసికి షాకిచ్చిన విద్యార్థి, ఆయన చేత్తో నో
హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది ప్రారంభంలో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా, శనివారం నాడు స్నాతకోత్సవం సందర్భంగా ఓ సంఘటన చోటు చేసుకుంది.
హెచ్సియు వీసీ అప్పారావు చేతుల మీదుగా పట్టా తీసుకోనని ఓ పరిశోధక విద్యార్థి అభ్యంతరం తెలిపారు. ఇది చర్చనీయాంశంమైంది. వేదిక పై నుంచి వ్యాఖ్యాత పరిశోధక విద్యార్థి సుంకన్నను పట్టా తీసుకోవడానికి ఆహ్వానించారు.
అందరిలాగే వేదిక పైకి చేరుకున్న సుంకన్న.. వీసీ నుంచి పట్టా తీసుకోవడానికి నిరాకరించారు. వేదిక పైకి వచ్చిన అతను పట్టా తీసుకోకుండా అలాగే నిలుచుండి పోయాడు. వేదిక పైన ఉన్న సుంకన్నతో ప్రోవీసీ శ్రీవాత్సవ మాట్లాడారు.
వీసీ అప్పారావు నుంచి తాను పట్టా తీసుకోనని చెప్పారు. ఆయన నుంచి తప్ప ఎవరి నుంచి అయినా తీసుకుంటానని తెలిపారు. దీంతో శ్రీవాత్సవ వచ్చి పట్టా అందించారు. రోహిత్ ఘటన నాటి నుంచి వీసీ అప్పారావును ఆ పదవి నుంచి తొలగించాలని కొందరు విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
అప్పారావు నుంచి పట్టా తీసుకోవడానికి నిరాకరించిన సుంకన్న మాట్లాడుతూ.. వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తాను పట్టా తీసుకోవడానికి నిరాకరించటానని చెప్పాడు. పట్టా తన చేతుల మీదుగా తీసుకోకపోవడం అన్నది విద్యార్థి ఇష్టమని, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సింది లేదని వీసీ అప్పారావు చెప్పారు.

వేముల రోహిత్
వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది ప్రారంభంలో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా, శనివారం నాడు స్నాతకోత్సవం సందర్భంగా ఓ సంఘటన చోటు చేసుకుంది. హెచ్సియు వీసీ అప్పారావు చేతుల మీదుగా పట్టా తీసుకోనని ఓ పరిశోధక విద్యార్థి అభ్యంతరం తెలిపారు.

పట్టా తీసుకున్న విద్యార్థినులు
శనివారం నాడు భాగ్యనగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం జరిగింది. పట్టాలు తీసుకున్న విద్యార్థినులు.

ఆనందం
శనివారం నాడు భాగ్యనగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం జరిగింది. పట్టాలు తీసుకున్న విద్యార్థినుల ఆనందం.

సంతోషం
శనివారం నాడు భాగ్యనగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం జరిగింది. పట్టాలు తీసుకున్న విద్యార్థినుల ఆనందం దృశ్యం.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications