అతి పెద్ద విపత్తు నుంచి తెలంగాణను రక్షించాం
మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు శ్రేణుల ప్రచారం వల్లనే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విజయానికి సహకరించిన సీపీఎం, సీపీఐ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
మునుగోడులో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్తో కలిసి జగదీష్ రెడ్డి సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. నేతలకు సీపీఐ నేతలు ఘనస్వాగతం పలికారు. సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్రెడ్డి, చాడ వెంకటరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

భవిష్యత్లోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. అతి పెద్ద విపత్తు నుంచి తెలంగాణను రక్షించామనే సంతోషం తమకుందని కూనంనేని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితంతో భారతీయ జనతాపార్టీకి ఎండ్ కార్డు పడిందన్నారు. కమ్యూనిస్టుల సహకారంతో మునుగోడు నియోజకవర్గాన్ని ప్రభాకర్ రెడ్డి బాగా అభివృద్ధి చేయాలని కోరారు. ఉభయ కమ్యూనిస్టుల సహకారంతో తాను మునుగోడును అభివృద్ధి చేస్తానని కూసుకుంట్ల ప్రకటించారు.
మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. బీజేపీ తరఫున పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి పోటీనిచ్చినప్పటికీ గెలవలేకపోయారు. చౌటుప్పల్ మండలంపై తాము గంపెడాశలు పెట్టుకున్నామని, కానీ ఇక్కడి నుంచి తక్కువ ఓట్లు పోలైనట్లుగా కౌంటింగ్ రోజే అర్థమైందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications