కలకలం: ఇద్దరు కాలేజీ విద్యార్థినుల అదృశ్యం
హైదరాబాద్: నగరంలోని నారాయణగూడలో ఇద్దరు కళాశాల విద్యార్ధినులు అదృశ్యమయ్యారు. రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్న చామంతి(18), దివ్య(20) అనే ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం నుంచి కనిపించడం లేదు.
కాలేజీ ముగిసిన తర్వాత కూడా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓ యువతిని కాపాడిన భద్రతా సిబ్బంది
కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని గురువారం కరీంనగర్ నుంచి నగరానికి వచ్చింది. ఓ హోటల్లో అద్దెకు దిగి శుక్రవారం తెల్లవారుజామున ట్యాంక్బండ్కు చేరుకుంది. ఉదయం 7.20 ప్రాంతంలో ఒక్కసారిగా నీళ్లల్లోకి దూకింది.
కాగా, గమనించిన ఓ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ హుటాహుటిన నీళ్లల్లో దూకి రక్షించే ప్రయత్నం చేశాడు. యువతి బయటకు రావడానికి నిరాకరిస్తూ నీళ్లల్లోకి వెళ్లిపోతుంది. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన ఓ ఉద్యోగి వాళ్లను గమనించి తనూ నీళ్లలోకి దూకాడు. ఇద్దరు కలిసి ఆ యువతిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. లేక్ సీఐ ధనలక్ష్మి ఆధ్వర్యంలో యువతికి లేక్పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి భరోసా కేంద్రానికి పంపించారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications