బార్లో గొడవ: పర్సు తీశావా అని అడిగితే వైజాగ్ టెక్కీని పొడిచేశారు
పర్సు తీశారా అని అడిగినందుకు వైజాగ్ టెక్కీని హైదరాబాదులో బీరు సీసాతో పొడిచేశారు. దాడిని చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాదులోని ఓ బారులో జరిగిన గొడవలో విశాఖపట్నం టెక్కీ గాయపడ్డాడు. పర్సు తీశారా అని వైజాగ్ టెక్కీ అడిగాడు. దాంతో ఇద్దరు వ్యక్తులు అతనిపై బీరుసీసాతో దాడి చేశారు. హైదరాబాదులోని కూకట్పల్లి లోని ఓ బార్లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
బీరు సీసాతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను గాయపర్చినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి సంగీతనగర్కు చెందిన ప్రవీణ్, రవితేజ(23), రోహిత్ అన్నదమ్ములు. ప్రవీణ్ చింతల్లో ఆటోమొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రవితేజ వైజాగ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రోహిత ఖమ్మంలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.

అన్న దమ్ములు ముగ్గురూ మద్యం తాగేందుకు కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోగల కేబీ బార్ అండ్ రెస్టారెంట్కు గురువారం రాత్రి వెళ్లారు. రవితేజ పర్సును టేబుల్పై పెట్టి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కౌంటర్ వద్దకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా పర్సు కనిపించలేదు. పక్క టేబుల్పై మద్యం తాగి కిందకు వెళ్తున్న మూసాపేటకు చెందిన విశాంత, మియాపూర్కు చెందిన నవీన్ను పర్సు తీశారా అని అడిగాడు.
తమను దొంగలంటావా అంటూ విశాంత బీరు సీసా పగులగొట్టి రవితేజ పొట్టలో నాలుగుసార్లు పొడిచాడు. ఘర్షణ విషయం తెలుసుకున్న రోహిత అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతడిని కూడా కొట్టి వారు పారిపోయారు. రవితేజను కేపీహెచ్బీ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విశాంత, నవీన్పై 307సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విశాంత హైదర్నగర్లోని మహీంద్రా షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా, నవీన్ ఎయిర్టెల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నారని ఎస్ఐ వెంకన్న తెలిపారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications