అమెరికాకు చెందిన భారత వైద్యుడి అరెస్టు

వెల్లూరుకు చెందిన విశ్వనాథన్ అమెరికాలోని జార్జియాలో ఉంటున్నాడు. చాట్స్వర్త్లోని ముర్రే కల్లోవే కౌంటీ ఆస్పత్రిలో అతను పనిచేస్తున్నాడు. పాల్ గ్యాస్ రిఫైనరీ డైరెక్టర్లలో డాక్టర్ విశ్వనాథన్ ఒకడని, ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన విశ్వనాథన్ పాల్ గ్యాస్ కుంభకోణంలో మరో ఇద్దరు ఎన్నారైలతో పాటు నిందితుడని, పదేళ్ల క్రితం ఆ కంపెనీ 9 కోట్ల రూపాయలు వసూలు చేసి వంటగ్యాస్ డీలర్షిప్ పొందడానికి ప్రయత్నించారని, అది జరగకపోవడంతో ప్రధాన నిందితుడు కృష్ణమూర్తి అరెస్టయ్యాడని పోలీసులు చెప్పారు. తన తల్లి అంత్యక్రియలకు వచ్చిన విశ్వనాథన్ సిఐడికి దొరికిపోయాడు.












Click it and Unblock the Notifications