దారుణం: అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ గ్రాసరీ స్టోర్లో జరిగిన దోపిడీలో పంజాబ్కు చెందిన ధరమ్ప్రీత్ సింగ్ జస్సెర్(21) దుండగుల చేతిలో మరణించాడు.
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ గ్రాసరీ స్టోర్లో జరిగిన దోపిడీలో పంజాబ్కు చెందిన ధరమ్ప్రీత్ సింగ్ జస్సెర్(21) దుండగుల చేతిలో మరణించాడు.
మూడేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై అమెరికాకు వెళ్లిన ధరమ్ప్రీత్ కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ఇతడు ఫ్రెస్నోలోని ఓ గ్రాసరీ స్టోర్లో రాత్రి పూట పార్ట్టైం జాబ్ కూడా చేస్తున్నాడు.

మంగళవారం రాత్రి ధరమ్ప్రీత్ విధుల్లో ఉండగా ఘోరం జరిగిపోయింది. హఠాత్తుగా ఓ నలుగురు దుండగులు గ్రాసరీస్టోర్లోకి ప్రవేశించారు. వారి చేతుల్లో గన్లను చూసిన ధరమ్ప్రీత్.. క్యాష్ కౌంటర్ కింద దాక్కున్నాడు.
కొన్ని వస్తువులను, డబ్బులను దోచుకుని వెళ్తూ వెళ్తూ.. ఆ దుండగుల్లో ఒకడు ధరమ్ప్రీత్ను దారుణంగా కాల్చేశాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ధరమ్ప్రీత్ చనిపోయాడు. కాల్పుల గురించి సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఆ గ్రాసరీ స్టోర్ వద్దకు చేరుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనంతరం గ్రాసరీ స్టోర్లో సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. స్టోర్ లోకి ప్రవేశించిన నలుగురు దుండగుల్లో ఒకరు భారతీయుడేనని పోలీసుల పరిశోధనలో వెల్లడైంది.
ఈ దారుణానికి ఒడిగట్టిన వారిలో ఒకరైన అర్మిత్రాజ్ సింగ్ అత్వాల్(22)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ధరమ్ప్రీత్ సింగ్ జస్సెర్ హత్య గురించి తెలుసుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ట్విటర్లో స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖమంత్రి సుష్మాస్వరాజ్ ను ఆయన కోరారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications