కడప ఫైట్: జగన్, కందుల ఫేస్ టు ఫేస్

మంత్రులంతా మోహరించినా, ప్రత్యేక పథకాలతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినా ఫలితం కనిపించకపోగా పరిస్థితి మరింత దిగజారిపోతోంది. గతంలో వైయస్ వెంట ఉన్న కాంగ్రెస్ నేతలంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోతున్నారు. దీంతో పులివెందుల కాంగ్రెస్ ఖాళీ అయిపోతోంది. పైగా మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అసంతృప్తితో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైయస్ కుటుంబానికి రాజకీయ పునాదిగా ఉన్న పులివెందుల నియోజకవర్గం నుండి పార్టీకి కాయకల్ప చికిత్స ప్రారంభించడానికి అధిష్టానం వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి రాజకీయ విరోధి కందుల శివానందరెడ్డిపై కాంగ్రెసు నాయకత్వం కన్నేసింది.
తెలుగుదేశం పార్టీకి తిలోదకాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ద్వారా లక్ష్యం సాధించాలని ప్రయత్నం చేస్తోంది. వారిలో కాంగ్రెస్ వర్గీయులను రప్పించడానికి కందులను నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా కందుల శివానందరెడ్డి సోదరుడు పారిశ్రామిక వేత్త కందుల రాజమోహన్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు డిసిసి అధ్యక్షునిగా కొనసాగిన బిసి వర్గానికి చెందిన యువనేత, వైఎస్ రాజశేఖర్రెడ్డి శిష్యుడు మాకం అశోక్కుమార్ విముఖత వ్యక్తం చేయడంతో గతంలో డిసిసి అధ్యక్షుడిగా పని చేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని కందులకు పగ్గాలు అప్పగించారు.
ఇటీవల కందుల సోదరులు కిరణ్కుమార్రెడ్డి, బొత్సలకు మరీ దగ్గరయ్యారు. దీంతో డిసిసి పగ్గాలు శివానందరెడ్డి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. జిల్లావ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గం నేతలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి వలస వెళ్లారు. వారంతా వైఎస్ రాజశేఖర్రెడ్డితో, జగన్మోహన్రెడ్డి ద్వారా లబ్ధిపొందారు. వైయస్సార్ కాంగ్రెసుతో కలిసిపోయారు. దీంతో కందుల శివానంద రెడ్డి ద్వారా ఆ అనుబంధాలపై వేటు వేయాలనేది ఎత్తుగడగా కనిపిస్తోంది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications