కడప ఫైట్: జగన్, కందుల ఫేస్ టు ఫేస్

మంత్రులంతా మోహరించినా, ప్రత్యేక పథకాలతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినా ఫలితం కనిపించకపోగా పరిస్థితి మరింత దిగజారిపోతోంది. గతంలో వైయస్ వెంట ఉన్న కాంగ్రెస్ నేతలంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోతున్నారు. దీంతో పులివెందుల కాంగ్రెస్ ఖాళీ అయిపోతోంది. పైగా మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అసంతృప్తితో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైయస్ కుటుంబానికి రాజకీయ పునాదిగా ఉన్న పులివెందుల నియోజకవర్గం నుండి పార్టీకి కాయకల్ప చికిత్స ప్రారంభించడానికి అధిష్టానం వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి రాజకీయ విరోధి కందుల శివానందరెడ్డిపై కాంగ్రెసు నాయకత్వం కన్నేసింది.
తెలుగుదేశం పార్టీకి తిలోదకాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ద్వారా లక్ష్యం సాధించాలని ప్రయత్నం చేస్తోంది. వారిలో కాంగ్రెస్ వర్గీయులను రప్పించడానికి కందులను నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా కందుల శివానందరెడ్డి సోదరుడు పారిశ్రామిక వేత్త కందుల రాజమోహన్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు డిసిసి అధ్యక్షునిగా కొనసాగిన బిసి వర్గానికి చెందిన యువనేత, వైఎస్ రాజశేఖర్రెడ్డి శిష్యుడు మాకం అశోక్కుమార్ విముఖత వ్యక్తం చేయడంతో గతంలో డిసిసి అధ్యక్షుడిగా పని చేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని కందులకు పగ్గాలు అప్పగించారు.
ఇటీవల కందుల సోదరులు కిరణ్కుమార్రెడ్డి, బొత్సలకు మరీ దగ్గరయ్యారు. దీంతో డిసిసి పగ్గాలు శివానందరెడ్డి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. జిల్లావ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గం నేతలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి వలస వెళ్లారు. వారంతా వైఎస్ రాజశేఖర్రెడ్డితో, జగన్మోహన్రెడ్డి ద్వారా లబ్ధిపొందారు. వైయస్సార్ కాంగ్రెసుతో కలిసిపోయారు. దీంతో కందుల శివానంద రెడ్డి ద్వారా ఆ అనుబంధాలపై వేటు వేయాలనేది ఎత్తుగడగా కనిపిస్తోంది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications