సి. రామచంద్రయ్యకు దేవుళ్లే దిక్కు?
మర్రి చెన్నారెడ్డి హయాంలో 1989లో దేవాదాయ శాఖను నిర్వహించిన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దండు శివరామరాజుకు దేవాదాయ శాఖను కేటాయించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో దండు శివరామరాజు ఓడిపోయారు. క్యాన్సర్ వ్యాధితో ఆయన ఇటీవల మరణించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేవాదాయ శాఖను నిర్వహించిన ఎం. సత్యనారాయణ రావు 2009 ఎన్నికల్లో ఓడిపోయి, రాజకీయంగా ముందు వరుసలో లేకుండా పోయారు.
ఆ తర్వాత జువ్వాడి రత్నాకర్ రావు దేవాదాయ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కూడా ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా చురుగ్గా లేకుండాపోయారు. ఆ తర్వాత దేవాదాయ శాఖను నిర్వహించిన గాదె వెంకటరెడ్డి 2009లో గెలిచినప్పటికీ ఆయనకు ఆ తర్వాత మంత్రి పదవి దక్కలేదు. జూపల్లి కృష్ణారావు విషయం తెలిసిందే. జూపల్లి రాజీనామా తర్వాత పొన్నాల లక్ష్మయ్యకు దేవాదాయ శాఖను అప్పగించే ప్రయత్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేశారు. కానీ దాన్ని తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. మొత్తం మీద, సి. రామచంద్రయ్య రాజకీయ జీవితంపై కూడా దేవాదాయ శాఖ ప్రభావం పడుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.